NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / అమెరికాలో భారత విద్యార్థినిపై పిడుగుపాటు.. క్రౌడ్ ఫండింగ్ కోరుతున్న బాధిత కుటుంబం
    తదుపరి వార్తా కథనం
    అమెరికాలో భారత విద్యార్థినిపై పిడుగుపాటు.. క్రౌడ్ ఫండింగ్ కోరుతున్న బాధిత కుటుంబం
    క్రౌడ్ ఫండింగ్ కోరుతున్న బాధిత కుటుంబం

    అమెరికాలో భారత విద్యార్థినిపై పిడుగుపాటు.. క్రౌడ్ ఫండింగ్ కోరుతున్న బాధిత కుటుంబం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 21, 2023
    01:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికాలో భారత యువతి పిడుగుపాటుకు గురైన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ మేరకు బాధితురాలి గుండె సుమారు 20 నిమిషాల పాటు లయ తప్పిందని, దీంతో మెదడు ప్రభావితమైనట్లు అక్కడి వైద్యలు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ప్రాణాల కోసం పోరాడుతున్నారు.

    ఆంధ్రప్రదేశ్ లోని నర్సరావుపేటకు చెందిన 25 ఏళ్ల కోడూరు సుశ్రూణ్య, ఉన్నత చదువుల నిమిత్తం అమెరికా వెళ్లింది. యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్‌ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్స్ (Masters in Information Technology) అభ్యసిస్తున్నారు.

    ఈ క్రమంలోనే ఫ్రెండ్స్ తో కలిసి ఓ స్విమ్మింగ్ పూల్ వెంట నడుస్తున్న క్రమంలో ఆకస్మాత్తుగా పిడుగుపడింది. ప్రమాద తీవ్రతకు ఆమె ఎగిరి కొలనులో పడిపోయారు.

    details

    క్రౌడ్ ఫండింగ్ వేదిక 'గోఫండ్‌ మీ' ద్వారా ఆర్థిక సాయం కోరుతున్న బాధిత కుటుంబం

    జులై తొలి వారంలోనే ఈ ప్రమాదం జరగ్గా, సుశ్రూణ్య ప్రస్తుతం కోమాలో ఉన్నారు. ఆమె పరిస్థితి ఆందోళకరంగా ఉందని వైద్యలు తెలిపారు. అయితే సుదీర్ఘ కాలం వైద్య చికిత్సలు అందించాల్సి ఉంటుందని ఆమెే బంధువు సురేంద్ర కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

    పెర్క్యుటేనియస్ ఎండోస్కోపిక్ గ్యాస్ట్రోస్టోమీ ట్యూబ్ సహకారంతో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నట్లు వైద్యలు పేర్కొన్నారు. MRI రిపోర్టులో అనాక్సిక్ ఎన్సెఫలోపతి ఏర్పడినట్లు (మెదడుకు ఆక్సిజన్ ఎక్కువ కాలం అందకపోవడం) డాక్టర్లు వివరించారు.

    అనాక్సిక్ ఎన్సెఫలోపతి కారణంగా న్యూరో సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. వైద్య చికిత్సలకు అయ్యే భారీ ఖర్చు కోసం క్రౌడ్ ఫండింగ్ వేదిక 'గోఫండ్‌ మీ' ద్వారా బాధిత కుటుంబం ఆర్థిక సాయం కోరుతున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    సుశ్రూణ్య తరఫున 'గోఫండ్‌ మీ' ద్వారా ఆర్థిక సాయం కోరుతున్న బాధితులు 

    Hello all
    This is My Friend @susroonyakoduru She went to USA for Masters.She was hurt by lightning on July 2nd 2023 at Sa Jacinto Houston Now her condition was critical and her parents are trying to reach her.She is fighting for her life alone.She needs huge amount for recovery pic.twitter.com/Rupqp4CHU8

    — Gayatri Manjula (@GayatriManjula) July 15, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెరికా

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    అమెరికా

    ఇక భారత్‌లోనే యుద్ధవిమానాల ఇంజిన్‌ల తయారీ; GE ఏరోస్పేస్- HAL మధ్య ఒప్పందం యుద్ధ విమానాలు
    భారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందం; 2024‌లో ఐఎస్ఎస్‌కి జాయింట్ ఆస్ట్రోనాట్ మిషన్‌  ఇస్రో
    అమెరికా కాంగ్రెస్‌లో ప్రధాని మోదీ చారిత్రక ప్రసంగం హైలెట్స్ ఇవే నరేంద్ర మోదీ
    డబ్ల్యూటీఓలోని 6వాణిజ్య వివాదాల పరిష్కారానికి భారత్ - అమెరికా అంగీకారం  వాణిజ్యం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025