
Ireland: ఐర్లాండ్లో భారతీయుడిపై జాత్యహంకార దాడి.. వివస్త్రను చేసి..
ఈ వార్తాకథనం ఏంటి
ఐర్లాండ్లోని డబ్లిన్ నగరంలో ఒక భారతీయుడు జాత్యహంకార దాడికి గురయ్యాడు. ఈ దాడి టలాట్ ప్రాంతంలో శనివారం, జూలై 19న చోటు చేసుకుంది. దుండగులు అతన్ని తీవ్రమైన మానసిక,శారీరక వేధింపులకు గురిచేశారు. దాదాపు 40 సంవత్సరాల వయస్సున్న బాధితుడిని దుండగులు బలవంతంగా వివస్త్రుడిని చేసి హింసించారు. దాడిలో అతడి ఛాతీ, చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలు కావడం తో పాటు, అధిక రక్తస్రావం జరిగింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గాయాలపాలైన బాధితుడిని తక్షణమే తల్లాఘట్ యూనివర్సిటీ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ఐర్లాండ్ జాతీయ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
వివరాలు
దాడిపై తీవ్రంగా స్పందించిన భారత రాయబారి
ఈ దాడిపై భారత రాయబారి అఖిలేష్ మిశ్రా తీవ్రంగా స్పందించారు. ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ, "ఈ రకమైన హింసాత్మక, భయానక దాడి ఎందుకు జరిగింది?" అని ప్రశ్నించారు. దాడికి గురైన బాధితుడికి అండగా నిలిచిన స్థానిక ఐరిష్ ప్రజలకు, 0 పోలీసులు తీసుకున్న చర్యలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.నిందితులను న్యాయస్థానం ముందు దోషిగా నిలబెట్టాలని పిలుపునిచ్చారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఐరిష్ ఎంబసీ ఇండియా చేసిన ట్వీట్
We are deeply saddened by the tragic air crash in Bangladesh 🇧🇩
— Irish Embassy India (@IrlEmbIndia) July 22, 2025
Our thoughts and prayers are with the victims, their families, and all those affected.
Ireland stands in solidarity with the people of Bangladesh during this difficult time 🇧🇩🇮🇪@KellyinDelhi @dfatirl
వివరాలు
మూడు వారాల క్రితమే ఐర్లాండ్కు..
ఇక, స్థానిక కౌన్సిలర్ బేబీ పెరెప్పాడన్ బాధితుడిని స్వయంగా కలిసి ఓదార్చారు. బాధితుడు తీవ్ర షాక్లో ఉన్నాడని, అందుకే చాలా తక్కువగా మాట్లాడారని ఆమె తెలిపారు. ఆయన ఇటీవలే, అంటే మూడు వారాల క్రితమే ఐర్లాండ్కు వచ్చారని చెప్పారు. ప్రస్తుతం బాధితుడు ఎవరినీ కలవలేని స్థితిలో ఉన్నాడని తెలిపారు. టలాట్ ప్రాంతంలో ఇటువంటి దాడులు పునరావృతమవుతున్న నేపథ్యంలో, ఈ ప్రాంతంలో పోలీసు భద్రతను మరింత బలపరచాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఆమె మాట్లాడుతూ, "ఐర్లాండ్కు వలస వచ్చే భారతీయులు ముఖ్యంగా వర్క్ పర్మిట్లతో పాటు ఆరోగ్య సంరక్షణ, ఐటీ వంటి రంగాల్లో ఉద్యోగాల కోసం వస్తారు. వారు సమాజానికి అవసరమైన నైపుణ్యాలు, సేవలను అందిస్తున్నారు" అని స్పష్టం చేశారు.
వివరాలు
ప్రజలు ఇంటి నుంచి బయటకు రావడానికి కూడా భయపడే పరిస్థితులు
ఈ ఘటనపై డబ్లిన్ సౌత్-వెస్ట్ నియోజకవర్గానికి చెందిన ప్రతినిధి సీన్ పెయిన్ తీవ్రంగా స్పందించారు. ఈ దాడిని ఆయన జాత్యహంకారంతో కూడిన హింసాత్మక చర్యగా అభివర్ణిస్తూ, "ఇది పూర్తిగా అభాసపాలైన చర్య. ఇలాంటి దాడులను మన సమాజంలో ఏ విధంగానూ ఆమోదించలేం" అని చెప్పారు. ఇలాంటి మతిలేని దాడులు సమాజాన్ని సురక్షితంగా మారుస్తాయన్న భావన తప్పుదారి పట్టించేదిగా ఉందని అన్నారు. ఇలాంటి సంఘటనల వల్ల ప్రజలు ఇంటి నుంచి బయటకు రావడానికి కూడా భయపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు.
వివరాలు
వలసదారులపై తప్పుడు ఆరోపణలు
అయితే, దాడి చేసిన వ్యక్తులు బాధితుడు తమ పిల్లలపై అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించినప్పటికీ, పోలీసులు దీనిని ఖండించారు. అలాంటి ఆరోపణలకు ఆధారాలు లేవని వారు స్పష్టంచేశారు. ఐర్లాండ్ న్యాయశాఖ మంత్రి జిమ్ ఓ'కాలగన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, వలసదారులపై తప్పుడు ఆరోపణలు ఎక్కువవుతున్నాయని అన్నారు. నేరాల విషయానికి వస్తే, వలసదారులు వాటిలో ప్రముఖంగా పాల్గొంటున్నారని చెప్పడానికి ఏ ఆధారాలు లేవని చెప్పారు. జైళ్లలో వలసదారుల శాతం, సమాజంలోని వలసదారుల మొత్తం శాతంతో పోల్చితే తక్కువగానే ఉందని వివరించారు.