NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / USA: అమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్త అక్షయ్‌ గుప్తా దారుణ హత్య.. 
    తదుపరి వార్తా కథనం
    USA: అమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్త అక్షయ్‌ గుప్తా దారుణ హత్య.. 
    అమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్త అక్షయ్‌ గుప్తా దారుణ హత్య..

    USA: అమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్త అక్షయ్‌ గుప్తా దారుణ హత్య.. 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 21, 2025
    10:19 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికాలో భారతీయ మూలాలు కలిగిన ఒక వ్యాపారవేత్తను దారుణంగా హత్య చేసిన ఘటన టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్‌ నగరంలో జరిగింది.

    ఓ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలోనే అతనిపై మరో భారత సంతతికి చెందిన వ్యక్తి ఘాతుకంగా దాడి చేసి హతమార్చాడు.

    వివరాల్లోకి వెళితే... 30 ఏళ్ల అక్షయ్‌ గుప్తా అనే యువకుడు హెల్త్-టెక్ స్టార్టప్‌కు సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు.

    మే 14న టెక్సాస్‌లో ప్రయాణిస్తున్న బస్సులో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

    బస్సులో వెనుకభాగంలో కూర్చున్న అక్షయ్‌పై అదే బస్సులో ఉన్న మరో భారతీయుడు దీపక్‌ కండేల్‌ ఆకస్మికంగా దాడి చేశాడు.

    ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన గుప్తాను అధికారులు వెంటనే ఆస్పత్రికి తరలించినా అప్పటికే అతను మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

    వివరాలు 

    అక్షయ్‌ నా మామలా కనిపించడంతోనే..

    ఈ ఘటనకు సంబంధించి అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన అధికారులు, ఘటనకు ముందు ఇద్దరి మధ్య ఎలాంటి వాగ్వాదం జరగలేదని స్పష్టంగా గుర్తించారు.

    దీపక్‌ కండేల్‌ అనుకోకుండా గుప్తాపై దాడి చేసినట్లు వీడియో ఆధారంగా తేలింది. సీసీటీవీ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశామని,అతనిపై హత్యారోపణలతో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు.

    ''అక్షయ్‌ నా మామలా కనిపించడంతోనే అతనిపై కత్తితో దాడి చేశాను'' అని దీపక్ పోలీసులకు చెప్పినట్టు తెలిసింది.

    అక్షయ్‌ గుప్తా విద్యార్హతల పరంగా పెన్‌ స్టేట్‌ యూనివర్శిటీలో మాస్టర్స్‌ పూర్తి చేశారు.

    ఇటీవల తన తాజా ప్రాజెక్టు నేపథ్యంలో మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్లను కూడా కలిసినట్టు సమాచారం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెరికా

    తాజా

    Journalist Krishnam Raju: అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు.. జర్నలిస్ట్ కృష్ణంరాజు అరెస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు
    UPI payments: యూపీఐ లావాదేవీలపై తప్పుడు ప్రచారం.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన కేంద్రం యూపీఐ
    DK Shivakumar-RCB: ఆర్సీబీతో భాగస్వామ్యం.. క్లారిటీ ఇచ్చిన డీకే శివకుమార్! బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Donald Trump: రేర్ ఎర్త్ మెటీరియల్స్‌పై అమెరికా-చైనా డీల్.. ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్.. డొనాల్డ్ ట్రంప్

    అమెరికా

    H-1B visa: హెచ్‌-1బీ వీసా మోసం కేసులో భారత సంతతి వ్యక్తికి 14 నెలల జైలు శిక్ష అంతర్జాతీయం
    US: ట్రంప్‌ సర్కార్‌ నుండి విదేశీ విద్యార్థులకు ఊరట  డొనాల్డ్ ట్రంప్
    North Korea: ఉత్తరకొరియాలో కొత్త విధ్వంసక నౌక ప్రారంభం.. కిమ్‌ జోంగ్ ఉన్‌ కీలక ప్రకటన ఉత్తర కొరియా
    US: పహల్గాం దాడి.. భారత్-పాక్‌లకు శాంతి సందేశం పంపిన అమెరికా డొనాల్డ్ ట్రంప్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025