
Iran : 12 రోజుల యుద్ధానికి తెర.. కాల్పుల విరమణ ప్రకటించిన ఇరాన్
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్ కీలక ప్రకటన చేసింది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినట్టు వెల్లడించింది. ఈ ప్రకటనకు కొద్దిసేపటి ముందే ఇజ్రాయెల్పై చివరి క్షిపణిని ప్రయోగించినట్టు ఇరాన్ తెలిపింది. ఈ ప్రకటనతో ఇజ్రాయెల్తో 12 రోజులుగా కొనసాగిన యుద్ధానికి తెరపడింది. ఇక కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. ఆయన 'ట్రూత్'లో పోస్టు చేస్తూ 12 రోజుల యుద్ధానికి ముగింపు. అందరికీ అభినందనలు. ఇజ్రాయెల్, ఇరాన్ పూర్తి కాల్పుల విరమణకు అంగీకరించాయి. మరో ఆరు గంటల్లో చర్యలు మొదలవుతాయి. 12 గంటల్లో యుద్ధం అధికారికంగా ముగుస్తుంది. తొలుత ఇరాన్ కాల్పుల విరమణ మొదలు పెడుతుంది, తరువాత ఇజ్రాయెల్ అనుసరిస్తుంది.
Details
మొదట ఖండించిన ఇరాన్
ఒక దేశం కాల్పుల విరమణ పాటిస్తే, మరో దేశం శాంతి, గౌరవాన్ని పాటించడం ముఖ్యము. అన్నీ సక్రమంగా జరగాలి. ఈ యుద్ధం ఏళ్ల తరబడి కొనసాగితే పశ్చిమాసియానే నాశనమయ్యేది. కానీ అలా జరగకపోవడం శుభం. ఇకపై అలా జరగకూడదు. ఇజ్రాయెల్, ఇరాన్తోపాటు మధ్యప్రాచ్యం, ప్రపంచంలోని అన్ని దేశాలకూ దేవుడి దయ ఉండాలని పేర్కొన్నారు. ఆయితే ట్రంప్ చేసిన ఈ ప్రకటనను ఇరాన్ మొదట ఖండించింది. కాల్పుల విరమణ గానీ, సైనిక కార్యకలాపాల విరమణ గానీ ఎలాంటి ఒప్పందం కుదరలేదని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చి తెలిపారు. యుద్ధం కొనసాగించడం మాకు అభిలష్యం కాదు.
Details
కాల్పుల విరమణపై ఒప్పందం లేదు
ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించింది, వాళ్లు దాడులను ఆపితే మేమూ ఆగడానికి సిద్ధం. కానీ ప్రస్తుతానికి కాల్పుల విరమణపై ఎలాంటి ఒప్పందం జరగలేదు. సైనిక కార్యకలాపాలపై తుది నిర్ణయం తరువాతే తీసుకుంటామని ప్రకటించారు. తాజా కాల్పుల విరమణ ప్రకటనకు కొద్ది గంటల ముందు తెల్లవారుజామున 4 గంటల తరువాత ఇరాన్ ఇజ్రాయెల్పై క్షిపణులను ప్రయోగించింది. దీనిని ఐడీఎఫ్ ధ్రువీకరించింది. టెహ్రాన్ క్షిపణి దాడుల నేపథ్యంలో దక్షిణ, మధ్య ఇజ్రాయెల్ అంతటా సైరన్లు మోగాయి. ప్రజలు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని ఐడీఎఫ్ సూచించింది. తాజా దాడుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.