LOADING...
Iran War : రష్యా ఇంటెలిజెన్స్‌తో ఇరాన్ దాడులు.. అమెరికా సంచలన ఆరోపణలు
రష్యా ఇంటెలిజెన్స్‌తో ఇరాన్ దాడులు.. అమెరికా సంచలన ఆరోపణలు

Iran War : రష్యా ఇంటెలిజెన్స్‌తో ఇరాన్ దాడులు.. అమెరికా సంచలన ఆరోపణలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 06, 2026
07:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్-అమెరికా సంయుక్త ఆపరేషన్‌లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించారని నివేదికలు వెల్లడించాయి. ఖమేనీ మరణంతో ఉగ్ర రోషంతో కుంగిపోయిన ఇరాన్, పశ్చిమ ఆసియాలోని అమెరికా సైనిక, వైమానిక స్థావరాలపై భారీ దాడులు జరుపుతోంది. అమెరికా సర్కార్ చేసిన సంచలన ఆరోపణల ప్రకారం, రష్యా ఇరాన్‌కు పశ్చిమాసియాలోని అమెరికా యుద్ధ నౌకలు, విమానాల స్థానం గురించి రియల్-టైమ్ సమాచారం అందిస్తోంది. దీనివల్ల ఇరాన్ తమ దాడులను మరింత ఖచ్చితంగా ప్లాన్ చేయగలుగుతున్నదని అమెరికా పేర్కొంది.

Details

ఓ యుద్ధనౌక ధ్వంసం

బహ్రెయిన్‌లోని జుఫైర్ ప్రాంతంలో ఉన్న అమెరికా నేవీ ఫిఫ్త్ ఫ్లీట్‌పై ఇరాన్ డ్రోన్ దాడిలో ఒక యుద్ధ నౌక ధ్వంసమైంది. అమెరికా MQ-9 రేపర్ డ్రోన్లు కూడా కూలిపోయాయని ప్రకటించింది. ఈ డ్రోన్లు ఎక్కడ, ఎవరు కూల్చారనేది స్పష్టత లేదు. అయితే, ఇరాన్ తీరంలో వీటి పై దాడి జరిగినట్లు గుర్తించబడింది. ఖతార్‌లోని సైనికుల ఫ్రెండ్లీ ఫైట్‌లో కూడా MQ-9 డ్రోన్ ధ్వంసమైనట్లు ఓ నివేదిక నివేదించింది.

Details

ఇరాన్ నుంచి ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులు

ఇరాన్ ఇజ్రాయెల్ నగరాలపై క్షిపణుల వర్షాన్ని కురిపిస్తోంది. టెల్ అవీవ్‌లో వరుస పేలుళ్లు చోటుచేసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా నివేదించింది. ఈ దాడులను అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ 'ఐరన్ డోమ్' యాక్టివేట్ చేశారు. గల్ఫ్ దేశాల్లో పరిస్థితి ఇరాన్ ముఖ్యంగా అమెరికా మిత్ర దేశాలనే టార్గెట్ చేస్తోంది. సౌదీ అరేబియాలోని రాస్ తనూరా ఆరాంకో రిఫైనరీపై ఇరాన్ డ్రోన్ దాడులు జరిగాయి. నాలుగు రోజుల్లో రెండుసార్లు దాడుల కారణంగా చమురు ఉత్పత్తి నిలిచిపోయింది. దుబాయ్‌లోనూ స్థానిక పౌరులు అప్రమత్తంగా ఉంటున్నారు.

Advertisement

Details

యుద్ధం తీవ్రత పెరుగుతోంది

యుద్ధం తీవ్రత రోజు రోజుకు పెరుగుతోందని, ఇరాన్ నుంచి జనం పెద్ద సంఖ్యలో తరలిపోతున్నారని అంతర్జాతీయ నివేదికలు పేర్కొన్నాయి. ఇప్పటి వరకు సుమారు 2 లక్షల మంది దేశం వీడి వెళ్లినట్లు తెలుస్తోంది. దాడులలో ఇప్పటివరకు దాదాపు 1,300 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 180 మంది చిన్నారులు ఉన్నారు. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైన మొదటి రోజే ఇరాన్ మినాబ్‌లోని ఓ పాఠశాలపై ఇజ్రాయెల్-అమెరికా దాడిలో 160 మంది విద్యార్థులు చనిపోవడం ప్రపంచాన్ని షాక్‌లో పడేసింది. బాలికల స్కూల్‌పై బాంబులు కురిపించడమే ఈ ఘోరం చోటుచేసుకోవడానికి కారణమైంది.

Advertisement