Loading...
Masoud Pezeshkian: అమెరికాతో పూర్తిస్థాయి యుద్ధం.. ఇరాన్ అధ్యక్షుడి సంచలన ప్రకటన
అమెరికాతో పూర్తిస్థాయి యుద్ధం.. ఇరాన్ అధ్యక్షుడి సంచలన ప్రకటన

Masoud Pezeshkian: అమెరికాతో పూర్తిస్థాయి యుద్ధం.. ఇరాన్ అధ్యక్షుడి సంచలన ప్రకటన

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 21, 2026
08:31 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి. పరస్పర దాడులు, హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో ప్రాంతంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక ప్రకటన చేశారు. అమెరికాతో తమ దేశం పూర్తిస్థాయి యుద్ధంలో ఉందని స్పష్టం చేశారు. ఇరాన్‌లోని పలు ప్రాంతాలపై అమెరికా దాడులను మరింత విస్తరించిందని పేర్కొంటూ, ఈ పరిస్థితులను దేశ ప్రజలు అర్థం చేసుకుని అంగీకరించాలని ఆయన కోరారు.

వివరాలు 

పది రోజులుగా అమెరికా సైనిక చర్యలు

హర్మూజ్ జలసంధిలో కార్గో నౌకలను ఇరాన్ లక్ష్యంగా చేసుకున్న ఘటనల అనంతరం అమెరికా చేపట్టిన సైనిక చర్యలు గత పది రోజులుగా కొనసాగుతున్నాయి.

ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన డ్రోన్, క్షిపణి నిల్వ కేంద్రాలు, తీరప్రాంత నిఘా వ్యవస్థలు, నౌకాదళానికి సంబంధించిన కీలక సామర్థ్యాలపై అమెరికా దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

ఈ పరిణామాల మధ్యనే అమెరికాతో పూర్తిస్థాయి యుద్ధం జరుగుతోందని ఇరాన్ అధ్యక్షుడు ప్రకటించడం అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

ADVERTISEMENT