
Israel-Iran: ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ మిలిటరీ చీఫ్ బాఘేరి మృతి
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్ వరుసగా ఇరాన్పై వైమానిక దాడులకు పాల్పడుతోంది.
ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్ సైనిక శ్రేణుల్లో ఉన్నతస్థాయి నేతల ప్రాణాలు కోల్పోయారు.
ఈ దాడుల్లో మిలిటరీ చీఫ్ బాఘేరి మరణించినట్లు ఇరాన్కు చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది.
అంతేగాక, ఇరాన్కు చెందిన పారామిలిటరీ విభాగమైన రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ మేజర్ జనరల్ హొస్సేన్ సలామీతో పాటు మరికొంత మంది కీలక అధికారులు కూడా ఈ దాడుల్లో మృతి చెందారు.
ఇదే క్రమంలో, ఇద్దరు అణు శాస్త్రవేత్తలు కూడా ప్రాణాలు కోల్పోయారు.
ఈ దాడుల ఉద్దేశ్యం ఏమిటో ఇజ్రాయెల్ ఇప్పటికే స్పష్టం చేసింది.
ఇరాన్లోని అణు శోధనా కేంద్రాలపై నేరుగా దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ అధికారికంగా వెల్లడించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ మిలిటరీ చీఫ్ బాఘేరి మృతి
🚨🇮🇱 🇮🇷 BREAKING: ISRAELI OFFICIAL SAYS IRAN’S ARMY CHIEF AND TOP NUCLEAR SCIENTISTS LIKELY KILLED IN STRIKES
— Mario Nawfal (@MarioNawfal) June 13, 2025
An Israeli defense official says it is increasingly likely that Iran’s military chief, Mohammad Bagheri, and several senior nuclear scientists were killed in the IDF’s… https://t.co/GJN1QFYMrf pic.twitter.com/iAcPhWY0yJ
వివరాలు
బాఘేరి
మహమ్మద్ బాఘేరి టెహ్రాన్లో జన్మించారు. ఆయన ఇరాన్ విప్లవ గార్డ్స్ కోర్లో (ఐఆర్జీసీ)చాలా కాలం పనిచేశారు.
2016లో ఆయన ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ పదవిని స్వీకరించారు.
ఇది దేశంలోని అత్యున్నత సైనిక హోదా. మిలిటరీ ఇంటెలిజెన్స్ రంగంలో ఆయనకు విశేష అనుభవం ఉంది.
1980లో ఐఆర్జీసీలో చేరిన ఆయన, ఇరాన్-ఇరాక్ యుద్ధంలో సైతం పాల్గొన్నారు. పొలిటికల్ జియోగ్రఫీ విభాగంలో పీహెచ్డీ కూడా చేశారు.
బాఘేరిపై మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలున్నాయి. ఈ కారణంగా అమెరికా,కెనడా,యునైటెడ్ కింగ్డమ్,యూరోపియన్ యూనియన్ ఆయనపై ఆంక్షలు విధించాయి.
2022-23లో మాషా అమిని మృతి నేపథ్యంలో దేశవ్యాప్తంగా జరిగిన ప్రజా ఆందోళనలను బలప్రయోగంతో అదుపు చేసిన ఘట్టం కూడా ఆయన ద్వారానే జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి.
వివరాలు
ప్రతీకారం తీర్చుకొంటాం..
ఇజ్రాయెల్ దాడులకు తాము తగిన ప్రతీకారం తప్పకుండా తీసుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ వెల్లడించారు.
టెల్అవీవ్కు తీవ్రమైన శిక్ష విధిస్తామన్నారు. టెహ్రాన్పై మొదట ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించగా, శుక్రవారం తెల్లవారుజామున రెండో దశ దాడులు జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
ఈ దాడుల్లో ఇరాన్లోని అణు కేంద్రాలు, సైనిక స్థావరాలే ప్రధాన లక్ష్యాలుగా మారాయి. ఇప్పటివరకు ఐదు విడతలుగా దాడులు కొనసాగాయి.
వివరాలు
ఇరాన్ అణుకేంద్రం ధ్వంసమైంది: ఐఏఈఏ
ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్లోని ప్రముఖ నతాంజ్ అణుశుద్ధి కేంద్రం ధ్వంసమైందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) అధికారికంగా వెల్లడించింది.
ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రోసీ 'ఎక్స్' మాధ్యమంగా చేసిన పోస్ట్లో, ఈ దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు.
ప్రస్తుతం ఇరాన్లో నెలకొన్న పరిస్థితులను సమీక్షిస్తున్నామని పేర్కొన్నారు.
రేడియేషన్ లీకేజీ స్థాయిపై సమాచారం అందుకోవడానికి ఇరాన్ అధికారులను సంప్రదిస్తున్నట్లు చెప్పారు.
అక్కడ ఉన్న తమ పరిశీలకులతో ఎప్పటికప్పుడు సంబంధం ఉంచుతున్నామని పేర్కొన్నారు.