LOADING...
US Radar: అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు.. ఖరీదైన రాడార్ ధ్వంసం
అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు.. ఖరీదైన రాడార్ ధ్వంసం

US Radar: అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు.. ఖరీదైన రాడార్ ధ్వంసం

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 03, 2026
11:08 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా తమపై సైనిక చర్యలు చేపట్టిన నేపథ్యంలో, ఇరాన్ తీవ్ర ప్రతీకార దాడులతో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా గల్ఫ్‌ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని టెహ్రాన్ దాడులు కొనసాగిస్తోంది. ఈ దాడుల్లో భాగంగా అమెరికాకు చెందిన కీలక రాడార్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైనట్లు తాజా సమాచారం వెల్లడించింది. ఈ రాడార్ అత్యంత ఖరీదైనదిగా గుర్తిస్తున్నారు. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్‌బేస్‌పై మార్చి 1న జరిగిన దాడిలో అమెరికా ఉపయోగించే AN/TPY-2 రాడార్ ధ్వంసమైందని శాటిలైట్ చిత్రాలు నిర్ధారించాయి. ఈ రాడార్, అమెరికా THAAD క్షిపణి రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. దీన్ని అభివృద్ధి చేయడానికి సుమారు 136 మిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు సమాచారం.

వివరాలు 

10 మంది అమెరికా సైనికులకు గాయాలు 

ఇదే ఎయిర్‌బేస్‌పై గత నెల జరిగిన దాడుల్లో E-3 ఎయిర్‌క్రాఫ్ట్‌తో పాటు ఇంధన రీఫ్యూయెలింగ్ ట్యాంకర్ కూడా నాశనమయ్యాయి. ఆ ఘటనలో దాదాపు 10 మంది అమెరికా సైనికులు గాయపడ్డారు. అప్పట్లో విడుదలైన శాటిలైట్ చిత్రాలు దాడిని నిర్ధారించినప్పటికీ, రాడార్ వ్యవస్థకు నష్టం జరిగిందా అనే విషయంలో స్పష్టత రాలేదు. తాజాగా మార్చి 29న వెలువడిన చిత్రాలతో ఆ రాడార్ దెబ్బతిన్నట్లు నిర్ధారణ అయింది. ఈ రాడార్ వ్యవస్థలు డ్రోన్లు మరియు క్షిపణులను ముందుగానే గుర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

వివరాలు 

ఖతార్'లో దెబ్బ తిన్న ఎర్లీ వార్నింగ్ రాడార్ 

ఇదే సమయంలో, జోర్డాన్ లోని మరో AN/TPY-2 రాడార్ కూడా ఇరాన్ దాడుల్లో ధ్వంసమైందని సమాచారం. అలాగే ఖతార్ లోని ఎర్లీ వార్నింగ్ రాడార్ కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. దీనిని పునర్నిర్మించడానికి సుమారు 100 కోట్ల డాలర్ల వరకు వ్యయం కావచ్చని అంచనా.

Advertisement