Mojtaba Khamenei: అలీ ఖమేనీ అంత్యక్రియలకు మొజ్తబా గైర్హాజరు.. భద్రతా సమస్యలే కారణం
ఈ వార్తాకథనం ఏంటి
భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇరాన్ దేశాధినేత మొజ్తబా ఖమేనీ తన తండ్రి ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొనబోరని భారత్లోని ఆ దేశ ప్రతినిధి ఆయతుల్లా హకీం ఇలాహి వెల్లడించారు. మొజ్తబా ఖమేనీకి అలీ ఖమేనీ అత్యంత సన్నిహితుడు. ప్రస్తుతం ఇజ్రాయెల్తో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా భద్రతాపరమైన ముప్పు ఎక్కువగా ఉందని, అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అలీ ఖమేనీకి ప్రజలు తుది నివాళులు అర్పించే కార్యక్రమాన్ని టెహ్రాన్లోని ఇమామ్ ఖొమేనీ గ్రాండ్ మొసల్లా సముదాయంలో శుక్రవారం నిర్వహించనున్నారు. అనంతరం ఈ నెల 6న ఆయన అంతిమయాత్ర ప్రారంభమవుతుందని ఇరాన్ అధికార వర్గాలు వెల్లడించాయి.
వివరాలు
టెహ్రాన్కు నేడు భారత ప్రతినిధి బృందం
అలీ ఖమేనీ పార్థివ దేహాన్ని ఆయన స్వస్థలమైన మషాద్లో ఈ నెల 9న ఖననం చేయనున్నట్లు తెలిపాయి. అలీ ఖమేనీ అంత్యక్రియల్లో భారత తరఫున పాల్గొనేందుకు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరిటా, బిహార్ గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్ శుక్రవారం టెహ్రాన్కు బయలుదేరి వెళ్లనున్నారు.