LOADING...
Strait of Hormuz: హర్మూజ్‌పై ఇరాన్ గట్టి పట్టు.. కీలక ప్రకటన
హర్మూజ్‌పై ఇరాన్ గట్టి పట్టు.. కీలక ప్రకటన

Strait of Hormuz: హర్మూజ్‌పై ఇరాన్ గట్టి పట్టు.. కీలక ప్రకటన

వ్రాసిన వారు Sirish Praharaju
May 03, 2026
11:52 am

ఈ వార్తాకథనం ఏంటి

పర్షియన్ గల్ఫ్‌, హర్మూజ్ జలసంధి విషయంలో కొత్త దశ ప్రారంభమవుతుందని ఇరాన్ అత్యున్నత నాయకుడు మొజ్తాబా ఖమేనీ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ విప్లవ గార్డు దళాల నౌకాదళం కీలక ప్రకటన చేసింది. పర్షియన్ గల్ఫ్‌, హర్మూజ్ జలసంధిలోని ముఖ్య సముద్ర మార్గాలపై తమ నియంత్రణను మరింత బలపరచాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు, నిబంధనలు సిద్ధంగా ఉన్నాయని.. అత్యున్నత నాయకుడి ఆదేశాల మేరకు వాటిని అమలు చేస్తామని వెల్లడించింది.

వివరాలు 

ప్రకటనను వెల్లడించిన ప్రెస్ టీవీ

పర్షియన్ గల్ఫ్‌, హర్మూజ్ జలసంధి వెంట సుమారు రెండు వేల కిలోమీటర్ల మేర విస్తరించిన ఇరాన్ తీరప్రాంతంపై తమ ఆధిపత్యం కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని నౌకాదళం పేర్కొంది. దేశ ప్రజల శక్తి, సామర్థ్యాలకు ప్రతిబింబంగా, జీవనోపాధికి ఆధారంగా, ప్రాంతీయ భద్రతకు బలంగా ఈ జలాలను అభివృద్ధి చేయడం తమ లక్ష్యమని తెలిపింది. ఈ ప్రకటనను ఇరాన్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని మీడియా సంస్థ ప్రెస్ టీవీ వెల్లడించింది. మరోవైపు హర్మూజ్ జలసంధిలో అమెరికా తన దిగ్బంధన చర్యలను కొనసాగిస్తోంది. ఇప్పటివరకు నలభై రెండు నౌకలను అడ్డుకున్నామని అమెరికా కేంద్ర సైనిక కమాండ్ తెలిపింది.

వివరాలు 

నౌకల రాకపోకలను సైనికుల ఆధ్వర్యంలో నియంత్రణ 

ఇటీవల పర్షియన్ గల్ఫ్ దినోత్సవం సందర్భంగా హర్మూజ్ జలసంధిపై ఇరాన్ అత్యున్నత నాయకుడు సమగ్ర వ్యూహాత్మక ప్రణాళికను ప్రకటించారు. ఈ కీలక సముద్ర మార్గంపై పూర్తి అధికారం, నిర్వహణ అంశాలను అందులో స్పష్టంగా పేర్కొన్నారు. జలసంధి ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇరాన్ కరెన్సీలోనే వసూలు చేయడం, ఇరాన్‌పై ఆంక్షలు విధించిన లేదా దుష్ప్రవర్తనకు పాల్పడిన దేశాల నౌకల నుంచి పరిహారం వసూలు చేయడం, నౌకల రాకపోకలను సైనికుల ఆధ్వర్యంలో నియంత్రించడం వంటి అంశాలు ఈ ప్రణాళికలో భాగంగా ఉన్నాయి.

Advertisement