NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / సిరియాలో టెర్రర్ దాడులు.. ఘర్షణల్లో మరణించిన ఐఎస్ఐఎస్ చీఫ్ ఖురాషీ 
    తదుపరి వార్తా కథనం
    సిరియాలో టెర్రర్ దాడులు.. ఘర్షణల్లో మరణించిన ఐఎస్ఐఎస్ చీఫ్ ఖురాషీ 
    ఘర్షణల్లో మరణించిన ఐఎస్ఐఎస్ చీఫ్ ఖురాషీ

    సిరియాలో టెర్రర్ దాడులు.. ఘర్షణల్లో మరణించిన ఐఎస్ఐఎస్ చీఫ్ ఖురాషీ 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 04, 2023
    03:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇస్లామిక్ స్టేట్ నాయకుడు అబూ హుస్సేన్ అల్-హుస్సేనీ అల్ ఖురాషీ మరణించారు.

    గతేడాది నవంబర్ నుంచి తీవ్రవాద సంస్థకు నేతృత్వం వహిస్తున్న నాయకుడు ఖురాషీ తిరుగుబాటుదారుల ఘర్షణల్లో చనిపోయినట్లు టెర్రరిస్ట్ గ్రూప్ ఐఎస్ఐఎస్ ధృవీకరించింది.

    ప్రత్యర్థి HTS ఆధీనంలోని వాయువ్య సిరియాలో ఈ ఘటన జరిగింది.

    హయత్ తహ్రీర్ అల్-షామ్(HTS)తో జరిగిన ప్రత్యక్ష ఘర్షణలో ప్రాణాలు కోల్పోయినట్లు ఆ సంస్థ తరఫున అధికార ప్రతినిధి వెల్లడించారు.

    ఈ మేరకు ఇస్లామిక్ స్టేట్ గురువారం తన టెలిగ్రామ్ ఛానెల్లో ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు.

    తదుపరి నాయకుడిగా అబూ హఫ్స్ అల్-హషిమి అల్-ఖురాషీని ప్రకటించారు. ఇడ్లిబ్ ప్రావిన్స్‌లోని జిహాదీస్ట్ గ్రూప్ హయత్ తహ్రీర్ అల్-షామ్‌తో నేరుగా తలపడ్డ కారణంగా హత్యకు గురయ్యాడని సమాచారం.

    DETAILS

    విస్తారమైన భూ ఆక్రమణల తర్వాత, క్రమంగా పట్టు కోల్పోయిన ఐఎస్ఐఎస్

    ఘర్షణకు గల కారణాలను మాత్రం ఇస్లామిక్ స్టేట్ ప్రతినిధి ప్రకటించలేదు.2014లో ఇరాక్, సిరియాలో అల్లర్లు పెరుగుదల తర్వాత, ఐఎస్ విస్తారమైన భూభాగాన్ని ఆక్రమించింది.

    అయితే, 2017లో ఇరాక్‌లో, 2019లో సిరియాలో ఓటమితో గత రెండేళ్లలో ఆ సంస్థ నియంత్రణ కోల్పోతూ వస్తోంది.

    ఈ నేపథ్యంలో 2019 అక్టోబర్‌లో ఇడ్లిబ్‌లో అబూ బాకర్ అల్ బాగ్దాదీ హతమయ్యారు. ఐఎస్ఐఎస్ సంస్థకు బాకర్ అలీ నాలుగో ఖలీఫ్ గా పనిచేశారు.

    మరోవైపు స్లీపర్ సెల్స్ ఇప్పటికీ 2 దేశాల్లో దాడులు చేస్తూనే ఉన్నారు.

    ఈ క్రమంలోనే ఐఎస్ నాయకుడు అబూ హసన్ అల్-హషిమీ అల్-ఖురాషి హతమైనట్లు తెలిపింది. అతని పూర్వీకుడు అబూ ఇబ్రహీం అల్-ఖురాషి 2022 ఫిబ్రవరిలో ఇడ్లిబ్ ప్రావిన్స్‌లో అమెరికా దాడిలో హత్యకు గురయ్యాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సిరియా
    ఉగ్రవాదులు

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    సిరియా

    టర్కీ, సిరియాలో ప్రకృతి విలయం: వరుస భూకంపాల ధాటికి 4300మందికిపైగా దుర్మరణం టర్కీ
    టర్కీకి ఆపన్నహస్తం: మొదటి విడతగా ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది, భూకంప సహాయక సామగ్రిని పంపిన భారత్ భారతదేశం
    టర్కీలో 5.4 తీవ్రతతో మరో భూకంపం, 5,000 దాటిన మరణాలు టర్కీ
    భూకంప బీభత్సం: టర్కీ, సిరియాలో 8వేలకు చేరిన మరణాలు టర్కీ

    ఉగ్రవాదులు

    'ముంబయిలో తాలిబన్ ఉగ్రదాడులు', ఎన్‌ఐఏకు బెదిరింపు మెయిల్ ఎన్ఐఏ
    ఐసీస్ సానుభూతిపరులే టార్గెట్: కేరళ, తమిళనాడు, కర్ణాటకలోని 60 చోట్ల ఎన్ఐఏ దాడులు ఎన్ఐఏ
    పోలీస్ హెడ్ ఆఫీస్‌పై ఉగ్రదాడి; 9మంది మృతి పాకిస్థాన్
    జమ్ముకశ్మీర్ నుంచి దశలవారీగా సైన్యాన్ని ఉపసంహరించుకునే ఆలోచనలో కేంద్రం జమ్ముకశ్మీర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025