Israel: టెహ్రాన్లో భారీ వైమానిక దాడులు.. 5వేల బాంబులతో ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్పై అమెరికా,ఇజ్రాయెల్ చేపట్టిన సంయుక్త దాడులు ఇంకా కొంతకాలం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. టెహ్రాన్కు వ్యతిరేకంగా ప్రారంభించిన ఈ సైనిక ఆపరేషన్ కనీసం మరో రెండు వారాల పాటు కొనసాగవచ్చని ఇజ్రాయెల్ సైన్యం సంకేతాలు ఇచ్చింది. ఇరాన్ ప్రభుత్వ వ్యవస్థను,అక్కడి ప్రధాన సైనిక స్థావరాలను పూర్తిగా దెబ్బతీయడమే తమ ప్రధాన లక్ష్యమని ఇజ్రాయెల్ మళ్లీ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, ఈ ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి బుధవారం వరకు తమ వైమానిక దళం ఇరాన్పై ఐదు వేలకుపైగా బాంబులతో దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ వెల్లడించింది. ఈ దాడుల్లో వేలాది మంది ఇరాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు కూడా తెలిపింది.
వివరాలు
ఒక్క ప్రాంతంపైనే 250 బాంబులు
టెహ్రాన్లోని అతిపెద్ద సైనిక సముదాయాన్ని లక్ష్యంగా చేసుకుని బుధవారం ఇజ్రాయెల్ వైమానిక దళం భారీ దాడి చేసింది. ఈ దాడికి 100కు పైగా యుద్ధ విమానాలు ఉపయోగించగా, ఆ ప్రాంతంలో సుమారు 250 బాంబులను పడవేశాయి. ఈ మిలిటరీ కాంపౌండ్లో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ (IRGC) ప్రధాన కార్యాలయం,ఐఆర్జీసీ కుద్స్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్, ఇరాన్ సైబర్ యూనిట్, అలాగే బసిజ్ పారామిలిటరీ దళాల హెడ్క్వార్టర్స్ వంటి కీలక కేంద్రాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ దాడుల వల్ల ఈ కీలక కార్యాలయాల్లో చాలా వరకు నాశనం అయినట్లు సమాచారం. అదేవిధంగా టెహ్రాన్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన డిటెక్షన్ వ్యవస్థలు, ఎయిర్ డిఫెన్స్ సదుపాయాలను కూడా ఇజ్రాయెల్ సైన్యం ధ్వంసం చేసింది.
వివరాలు
అమెరికా అక్కడ… ఇజ్రాయెల్ ఇక్కడ
ఇరాన్లో ఏ ప్రాంతాల్లో దాడులు జరపాలి అనే వివరాలను అమెరికాతో పంచుకున్నామని ఇజ్రాయెల్ వెల్లడించింది. పశ్చిమ,మధ్య ఇరాన్లో ఉన్న సైనిక స్థావరాలు, బాలిస్టిక్ క్షిపణి లాంచర్లపై ఇజ్రాయెల్ వైమానిక దళం దాడులు కొనసాగిస్తోంది. అదే సమయంలో దక్షిణ ఇరాన్లో ఉన్న క్షిపణి లాంచర్లను అమెరికా లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. ఈ ప్రాంతం నుంచే టెహ్రాన్ గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను టార్గెట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ఆపరేషన్కు మద్దతుగా సుమారు వెయ్యికి పైగా అమెరికన్ సిబ్బంది ప్రస్తుతం ఇజ్రాయెల్లో విధులు నిర్వర్తిస్తున్నారు.