
IDF: ఇరాన్ న్యూక్లియర్ ప్రాజెక్టుపై దాడులు చేశాం: ఇజ్రాయెల్ అధికారిక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య ప్రత్యక్ష దాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో టెహ్రాన్లోని కీలక ప్రాంతాలపై ఇజ్రాయెల్ వరుసగా దాడులకు పాల్పడిందని వెల్లడైంది.
ఇజ్రాయెల్ సైనిక దళం (IDF) అధికారికంగా 'ఎక్స్' (ఇతిపూర్వం ట్విట్టర్) ఖాతా ద్వారా ఈ దాడుల వివరాలను వెల్లడించింది.
Details
పలు నగరాల్లో అప్రమత్తత
ఇరాన్కు చెందిన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ హెడ్క్వార్టర్స్ తో పాటు, అతి గోప్యంగా నడుస్తున్న ఎస్పీఎన్డీ (SPND) న్యూక్లియర్ వెపన్స్ ప్రాజెక్టు కార్యాలయంపై దాడులు జరిపినట్టు పేర్కొంది.
ఈ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్లో పలు నగరాల్లో అప్రమత్తత నెలకొంది. సైరన్ల మోగింపుతో ప్రజల్లో భయాందోళన మొదలైంది.
లక్షల మంది తమ ప్రాణాల రక్షణ కోసం అత్యవసర షెల్టర్లవైపు పరుగులు పెట్టినట్లు సమాచారం. మొత్తం ఘటనతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత ఉద్ధృతంగా మారాయి.