NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం.. ఇరు దేశాల్లో 500 మందికి పైగా మృతి 
    తదుపరి వార్తా కథనం
    ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం.. ఇరు దేశాల్లో 500 మందికి పైగా మృతి 
    ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం.. ఇరు దేశాల్లో 500 మందికి పైగా మృతి

    ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం.. ఇరు దేశాల్లో 500 మందికి పైగా మృతి 

    వ్రాసిన వారు Stalin
    Oct 08, 2023
    09:54 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్- ఇజ్రాయెల్ మధ్య యుధం భీకరంగా సాగుతోంది.

    హమాస్ మిలిటెంట్లు జరిపిన ఆకస్మిక దాడిలో ఇజ్రాయెల్‌లో 300 మందికి పైగా మరణించారు. ఇజ్రాయెల్ చేసిన ప్రతిదాడిలో గాజాలో 230మందికి పైగా మృతి చెందారు.

    హమాస్ మిలిటెంట్ల దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రతిన బూనారు. అంతేకాదు.. శనివారాన్ని 'బ్లాక్ డే'గా ప్రకటిచారు.

    తమ సైన్యం పూర్తి శక్తితో గాజాలోని హమాస్‌ తీవ్రవాదులపై దాడి చేస్తుందని వివరించారు.

    హమాస్ స్థావరాలను నాశనం చేయడానికి తమ సైన్యం తన శక్తినంతా ఉపయోగించుకుంటోందని వెల్లడించారు.

    యుద్ధం

    ఇజ్రాయెల్ పౌరులను ఊచకోత కోస్తున్న హమాస్ మిలిటెంట్లు 

    హమాస్ మిలిటెంట్లు డజన్ల కొద్దీ ఇజ్రాయెల్ సైనికులను తమ ఆధీనంలోకి తీసుకొని కిరాతకంగా చంపారు. దీంతో శనివారం ఇజ్రాయెల్ సైన్యం గణనీయమైన నష్టాలను చవిచూసింది.

    అలాగే, హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌లోని ఇళ్లలోకి చొరబడి పౌరులను ఊచకోత కోశారు.

    వందలాది మంది హమాస్ మిలిటెంట్లు తమ దేశంలోకి చొరబడి విధ్వంసం సృష్టిస్తున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రతినిధి రిచర్డ్ హెచ్ట్ చెప్పారు.

    ఇదిలా ఉంటే, పాలస్తీనా, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆదివారం అత్యవసరం సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

    మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్‌కు తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. హమాస్ గ్రూప్‌కు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇజ్రాయెల్
    పాలస్తీనా

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    ఇజ్రాయెల్

    పాలస్తీనాపై ఇజ్రాయెల్ దళాల దాడి; 11మంది మృతి పాలస్తీనా
    ఇజ్రాయెల్‌లో ఎవరికీ తెలియని కరోనా కొత్త వేరియంట్; రెండు కేసులు నమోదు కోవిడ్
    న్యాయ సంస్కరణలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌లో భారీ నిరసనలు; నెతన్యాహు ప్రభుత్వానికి అల్టిమేటమ్ వరల్డ్ లేటెస్ట్ న్యూస్
    ఇజ్రాయెల్ ప్రతీకారం; లెబనాన్‌లోని గాజా స్ట్రిప్‌పై వైమానిక దాడులు వరల్డ్ లేటెస్ట్ న్యూస్

    పాలస్తీనా

    ఇజ్రాయెల్‌‌లో యుద్ధ మేఘాలు.. గాజా నుంచి 5,000 రాకెట్లు ప్రయోగించిన హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్
    India issues advisory : ఇజ్రాయెల్‌‌లో భారతీయులకు కేంద్రం కీలక సూచనలు  ఇజ్రాయెల్
    హమాస్ రాకెట్ దాడుల్లో ఇజ్రాయెల్ మేయర్ సహా 22 మంది మృతి  ఇజ్రాయెల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025