Page Loader
Israel: గాజా ఆక్రమణకు ఇజ్రాయెల్ ప్లాన్.. సైనిక వ్యూహం ముమ్మరం!
గాజా ఆక్రమణకు ఇజ్రాయెల్ ప్లాన్.. సైనిక వ్యూహం ముమ్మరం!

Israel: గాజా ఆక్రమణకు ఇజ్రాయెల్ ప్లాన్.. సైనిక వ్యూహం ముమ్మరం!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 05, 2025
02:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్ భద్రతా మంత్రివర్గం గాజా పట్టణాన్ని పూర్తిగా ఆక్రమించేందుకు, అదికాగా అక్కడ నిరవధికంగా మోహరించేందుకు ఓ వ్యూహాన్ని ఆమోదించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. హమాస్‌పై ఒత్తిడి పెంచి, బందీల విడుదలకు, ఇజ్రాయెల్‌ నిబంధనలతో యుద్ధ విరమణకు వాతావరణం సృష్టించేందుకే ఈ చర్యలన్నీ చేపట్టారని తెలిపారు. ఇందులో భాగంగా, లక్షలాది ఫలస్తీన్ వాసులను దక్షిణ గాజా వైపు తరలించే అంశం కూడా ప్లాన్‌లో భాగమేనని తెలుస్తోంది. అయితే ఈ వివరాలు చెప్పిన అధికారులే తమ పేర్లు వెల్లడించకూడదని కోరారు. ఎందుకంటే వారు సైనిక వ్యూహాలను చర్చిస్తున్నారని తెలిపారు.

Details

సగం ప్రాంతం ఆధీనం

ఇక ఆదివారం రోజున ఇజ్రాయెల్‌ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఐయాల్ జమీర్ మాట్లాడుతూ, లక్షలాది రిజర్వ్ సైనికులను పిలుపునిచ్చినట్టు చెప్పారు. గాజాలో మరిన్ని ప్రాంతాల్లో ఆర్మీ చర్యలు కొనసాగుతాయని, ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడులు కొనసాగుతాయని తెలిపారు. ఇప్పటికే ఇజ్రాయెల్‌ గాజాలో సుమారు సగం ప్రాంతాన్ని తన అధీనంలోకి తీసుకుంది. దీనిలో ఇజ్రాయెల్‌ సరిహద్దును ఆనుకునే బఫర్ జోన్‌తో పాటు తూర్పు-పడమర దిశల్లో వెళ్లే మూడు ప్రధాన కారిడార్లు ఉన్నాయి.

Details

మళ్లీ దాడులు 

ఈ క్రమంలో మార్చి 18న ఇజ్రాయెల్ మళ్లీ గాజాలో హమీదులపై గట్టి దాడులు ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు 2,600 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి ఆరోగ్య అధికారులు తెలిపారు. వారిలో ఎక్కువమంది మహిళలు, పిల్లలున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ఈ చర్యలన్నింటినీ హమాస్‌పై ఒత్తిడి పెంచి, వారిని చర్చలకు సిద్ధం చేయడానికేనని చెబుతోంది. మార్చిలో గాజాకు సహాయం పంపడాన్ని కూడా ఆపివేసిన ఇజ్రాయెల్‌ ఆ నిర్ణయాన్ని ఇప్పటివరకు కొనసాగిస్తూనే ఉంది. దీంతో రెండు మిలియన్లకు పైగా జనాభా ఉన్న గాజాలో తీవ్ర ఆకలితో పాటు అవసరమైన వస్తువుల కొరత పెరిగింది. దీనివల్ల దొంగతనాలు, లూటీలు కూడా పెరిగినట్టు నివేదికలు చెబుతున్నాయి.

Details

 బందీలు ఇంకా గాజాలోనే 

హమాస్ ఆధ్వర్యంలోని మిలిటెంట్లు గతంలో దక్షిణ ఇజ్రాయెల్‌పై దాడి చేసి, సుమారు 1,200 మందిని చంపారు. అలాగే 250 మందిని బందీలుగా తీసుకెళ్లారు. ఇజ్రాయెల్ ప్రకారం, ఇంకా 59 మంది బందీలు గాజాలోనే ఉన్నారు. అయితే వీరిలో సుమారు 35 మంది ఇప్పటికే మరణించివుండే అవకాశముందని

Details

ఇజ్రాయెల్ దాడుల్లో 52,000 మందికి పైగా మృతి 

ఇజ్రాయెల్‌ ప్రారంభించిన ప్రతీకార దాడుల్లో ఇప్పటివరకు 52,000 మందికి పైగా గాజా నివాసితులు మరణించారని అక్కడి ఫలస్తీన్ ఆరోగ్య శాఖ సమాచారం. వారిలో అధిక సంఖ్యలో మహిళలు, చిన్నారులే ఉన్నట్టు పేర్కొంటున్నారు. అయితే ఈ గణాంకాల్లో యుద్ధోన్ముఖులు, సామాన్య ప్రజలు మధ్య తేడా చూపించకుండా మొత్తం సంఖ్యను మాత్రమే ఇవ్వడం గమనార్హం. ఈ యుద్ధంలో గాజా జనాభాలో సుమారు 90శాతం మంది తమ నివాసాలు వదిలి పలు మార్లు తరలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం గాజా ఒక పాడు ప్రదేశంగా మారిందని, అక్కడ జీవించడం అసాధ్యమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.