
Iran-Israel: ఫోర్డో అణుకేంద్రంపై మరోసారి ఇజ్రాయెల్ దాడులు
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్లోని ముఖ్య అణుకేంద్రాలపై అమెరికా తాజాగా విరుచుకుపడింది. ఫోర్డో (Fordo)లోని భూగర్భ అణుశుద్ధి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ క్షిపణులు, డ్రోన్లతో దాడులకు పాల్పడినట్టు ఇరాన్ మీడియా వెల్లడించింది. ఈ దాడుల్లో జరిగిన నష్టం ఎంతుందో ఇంకా అధికారికంగా తెలియరాలేదు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోని పలు ప్రాంతాలపై కూడా దాడులు జరిగినట్టు సమాచారం. యురేనియం శుద్ధి సామర్థ్యం ఉన్న ఫోర్డో భూగర్భ కేంద్రం ఉపరితలం నుండి దాదాపు 90 మీటర్ల లోతులో ఉంది. ఈ కేంద్రాన్ని ధ్వంసం చేయగల శక్తిమంతమైన బాంబులు ఇజ్రాయెల్ వద్ద లేవని నిపుణులు అభిప్రాయపడ్డారు. దీంతో ఈ దాడిలో అమెరికా జోక్యం చేసుకుంది.
Details
అధికారికంగా ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు
అమెరికా శక్తివంతమైన బీ-2 స్పిరిట్ బాంబర్లను వినియోగించి ఫోర్డో, నతాంజ్, ఇస్ఫాహన్ కేంద్రాలపై ఇజ్రాయెల్తో కలిసి శక్తిమంతమైన దాడులకు పాల్పడింది. అమెరికా అధ్యక్షుడు స్వయంగా ఈ విషయాన్ని ఆదివారం ప్రకటించారు. సోమవారం ఇరాన్ సాయుధ దళాల సంయుక్త సిబ్బంది అధిపతి జనరల్ అబ్దుల్ రహీం మౌసావి మాట్లాడుతూ... "ఇరాన్పై అమెరికా చేసిన దాడులతో మా సైన్యానికి మరిన్ని లక్ష్యాలేర్పడ్డాయి. మధ్యప్రాచ్యంలో ఉన్న దాదాపు పదివేల అమెరికన్ సైనికులు స్వల్పశ్రేణి ఇరానియన్ క్షిపణుల పరిధిలో ఉన్నారు. అణుకేంద్రాలపై చేసిన దాడులకు అగ్రరాజ్యం తగిన మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు.
Details
ఐక్యరాజ్యసమితి నిఘా సంస్థ వ్యాఖ్యలు
ఫోర్డో అణుశుద్ధి కేంద్రాలపై అమెరికా దాడుల కారణంగా ఇరాన్ కేంద్రానికి గణనీయ నష్టం జరిగి ఉంటుందని ఐక్యరాజ్యసమితి నిఘా సంస్థ అధిపతి రాఫెల్ మారియానో తెలిపారు. ఇది ఇరాన్కు కోలుకోలేని దెబ్బ. ప్రస్తుతానికి ఫోర్డో కేంద్రానికి జరిగిన నష్టం అంచనా వేయే స్థితిలో ఎవరూ లేరని అన్నారు. ఇరాన్ రహస్య యోచన తాజా అమెరికా-ఇజ్రాయెల్ దాడుల సమయంలోనే ఇరాన్ తన శుద్ధి చేసిన యురేనియం మొత్తాన్ని రహస్య ప్రదేశానికి తరలించిందని సమాచారం. వీటిలో కొంత భాగం ఫోర్డో అణుకేంద్రం నుంచే తరలించబడినట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు.