Page Loader
Israeli strikes: హమాస్ కమాండర్ ఖలీద్ నజ్జర్‌ హతం 
Israeli strikes: హమాస్ కమాండర్ ఖలీద్ నజ్జర్‌ హతం

Israeli strikes: హమాస్ కమాండర్ ఖలీద్ నజ్జర్‌ హతం 

వ్రాసిన వారు Stalin
May 27, 2024
11:01 am

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇజ్రాయెల్ దళాలు రఫాతో సహా గాజా స్ట్రిప్‌పై విరుచుకుపడుతున్నాయి. తాజా దాడుల్లో ఇజ్రాయెల్ ఆర్మీ వెస్ట్ బ్యాంక్ పై దాడులు కొనసాగిస్తోంది. ఈక్రమంలో హమాస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ యాసిన్ రబియా పాలస్తీనా గ్రూపులోని సీనియర్ సభ్యుడు ఖలీద్ నజ్జర్‌లను హతమార్చినట్లు ఆర్మీ తెలిపింది. కాగా,ఈ దాడుల్లో మరో 30మంది పాలస్తీనీయులు చనిపోయారు.ఒక వైపు హమాస్‌పై యుద్ధం పేరుతో ఇజ్రాయెల్ యథేచ్ఛగా మారణ కాండను జరుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వచ్చేవారం ఇరుపక్షాలమధ్య చర్చలు తిరిగి ప్రారంభించేందుకు మధ్యవర్తులు యత్నిస్తున్నారు. ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొసాద్‌,అమెరికన్‌ గూఢచారి సంస్థ సిఐఎ అధిపతి,ఖతార్‌ ప్రధాని జసీమ్ అల్ తానీతో జరిపిన చర్చల్లో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Details 

చర్చలపై హమాస్‌ నుంచి స్పందన కరవు 

ఖతార్‌, ఈజిప్టు, అమెరికా మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. చర్చల పునరుద్ధరణ పై హమాస్‌ ఇంతవరకు ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అంతర్జాతీయ న్యాయస్థానం గాజాపై ఇజ్రాయెల్ దాడులను తక్షణమే ఆపాలని అంతర్జాతీయ నేర విచారణ కోర్టు (ఐసిసి) చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ ఆదేశించారు. యుద్ధ నేరాలకు పాల్పడుతున్న నెతన్యాహుకు అరెస్టు వారెంట్‌ జారీ చేయాలని కోరారు. ఇజ్రాయెల్ కు మద్దతుదారుగా ఉన్న అమెరికాకు ఇది అంతర్జాతీయంగా బిగ్ షాక్ గా భావించాలి. ఇంకోవైపు లెబనాన్‌ నుంచి హిజ్బుల్లాలు, యెమెన్‌ నుంచి హౌతీలు ఇజ్రాయెల్, దానికి మద్దతు ఇస్తున్న పశ్చిమ దేశాలపై ప్రతీకార చర్యలకు పూనుకున్నాయి . దీంతో ఇది ప్రాంతీయ యుద్ధానికి దారి తీసేలా ఉంది.

Details 

ఇజ్రాయిల్‌ దాడుల్లో 35,903 మంది పాలస్తీనీయులు మృతి 

ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్‌, అమెరికా చర్చల పునరుద్ధరణకు అయిష్టంగానైనా అంగీకరించకతప్పని పరిస్థితి ఏర్పడింది. చర్చలకు ఒక వైపు అంగీకరిస్తూనే మరో వైపు గాజాపై బాంబు దాడులను తీవ్రతరం చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఇజ్రాయిల్‌ గత 230 రోజులుగా ఇజ్రాయిల్‌ సాగిస్తున్న దాడుల్లో పిల్లలు, మహిళలతో సహా మొత్తం 35,903 మంది పాలస్తీనీయులు చనిపోయారు. మరో 80,420 మంది గాయపడ్డారు. గాజాకు సంఘీభావంగా యెమెన్‌లోను, పశ్చిమ దేశాల్లోను ప్రదర్శనలు కొనసాగుతున్నాయి.