LOADING...
Israel: ఖమేనీ మరణం వెనుక ఇజ్రాయెల్ గుప్త ఆపరేషన్.. అంతరిక్షం నుంచి దూసుకొచ్చిన 'బ్లూ స్పారో' క్షిపణులు
అంతరిక్షం నుంచి దూసుకొచ్చిన 'బ్లూ స్పారో' క్షిపణులు

Israel: ఖమేనీ మరణం వెనుక ఇజ్రాయెల్ గుప్త ఆపరేషన్.. అంతరిక్షం నుంచి దూసుకొచ్చిన 'బ్లూ స్పారో' క్షిపణులు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 06, 2026
03:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణం వెనుక ఇజ్రాయెల్ అమలు చేసిన ఆపరేషన్ గురించి ఆసక్తికర వివరాలు బయటకు వస్తున్నాయి. ఖమేనీని లక్ష్యంగా చేసుకునే ముందు ఇజ్రాయెల్ ఒక రహస్యవ్యూహాన్ని అమలు చేసింది. టెల్ అవీవ్‌లోని తమ ప్రధాన సైనిక కేంద్రంలో కార్యకలాపాలు తగ్గినట్టుగా చూపిస్తూ,ఐడీఎఫ్ సిబ్బంది శబత్ వేడుకల కోసం సెలవుల్లోకి వెళ్తున్నట్టుగా ప్రచారం చేసింది. సైనికాధికారులు,ఉన్నతాధికారులు కార్యాలయాలను వదిలి ఇంటికి వెళ్తున్నట్టుగా కనిపించేలా ఫోటోలు,సమాచారం విడుదల చేశారు. దీంతో ఇరాన్‌కు ఎలాంటి పెద్ద సైనిక చర్య ఉండదనే భావన కలిగింది. ఈపరిస్థితిని ఉపయోగించుకుని ఖమేనీ తన సురక్షిత స్థావరం నుంచి బయటకు వచ్చి అధికారులతో సమావేశం కోసం ప్యాలెస్‌కు చేరుకున్న సమయంలోనే ఇజ్రాయెల్ ఆపరేషన్ ప్రారంభించినట్లు సమాచారం.

వివరాలు 

"బ్లూ స్పారో" క్షిపణుల ప్రయోగం 

ఇరాన్ సమయానుసారం ఉదయం 7:30 గంటలకు ఇజ్రాయెల్ యుద్ధవిమానాలు ఎగిరి తమ స్థానాల్లోకి చేరాయి. ఉదయం 9:40 ప్రాంతంలో "బ్లూ స్పారో" క్షిపణులను ప్రయోగించాయి. వీటిలో సుమారు 30 క్షిపణులు ఖమేనీ నివాస సముదాయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేశాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ క్షిపణుల ప్రత్యేకత ఏమిటంటే, అవి భూమి వాతావరణాన్ని దాటి అంతరిక్ష అంచుకు వెళ్లి తిరిగి లక్ష్యాన్ని తాకే విధంగా రూపకల్పన చేయబడ్డాయి. అందువల్ల వాటిని గుర్తించడం, అడ్డుకోవడం చాలా కష్టమని నిపుణులు చెబుతున్నారు. ఈ క్షిపణులు పూర్వ సోవియట్ యూనియన్ స్కడ్ మిస్సైళ్లతో పాటు ఇరాన్ షహాబ్-3 క్షిపణుల నమూనాలను ఆధారంగా చేసుకుని రూపొందించబడినట్లు సమాచారం.

వివరాలు 

ఆ ప్రాంతంలో ఫోన్లు బిజీగా కనిపించే పరిస్థితి

ఇదిలా ఉండగా, దాడికి ముందు ఇజ్రాయెల్ మరో కీలక చర్య కూడా చేపట్టినట్లు తెలుస్తోంది. టెహ్రాన్‌లోని పాస్తూర్ స్ట్రీట్ పరిసర ప్రాంతాల్లో ఉన్న మొబైల్ టవర్‌లపై ఇజ్రాయెల్ జోక్యం చేసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో ఫోన్లు బిజీగా కనిపించే పరిస్థితి ఏర్పడి, ఖమేనీ భద్రతా సిబ్బందికి దాడి గురించి ఎలాంటి హెచ్చరికలు చేరకుండా చేసినట్లు సమాచారం. అంతేకాదు, టెహ్రాన్ నగరంలోని పర్యవేక్షణ కెమెరాలపై కూడా ఇజ్రాయెల్‌కు యాక్సెస్ ఉన్నట్లు సమాచారం. ఆ కెమెరాల ద్వారా ఖమేనీ బాడీగార్డుల కదలికలను గమనించి, వారి నివాసాలు, విధులు, షెడ్యూల్‌లపై పూర్తి సమాచారం సేకరించినట్లు వెల్లడైంది.

Advertisement

వివరాలు 

అత్యంత గోప్యంగా, సాంకేతికంగా అమలు చేసిన దాడి

ఈ సమాచారం మొత్తం టెల్ అవీవ్‌లోని కేంద్రాలకు పంపబడగా, మోసాద్ గూఢచార సంస్థ దానిని విశ్లేషించి ఖమేనీ ఖచ్చితమైన స్థానాన్ని గుర్తించిందని అంతర్జాతీయ మీడియా నివేదికలు చెబుతున్నాయి. కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత సాంకేతికతలు, ప్రత్యేక అల్గోరిథంల సహాయంతో ఖమేనీ కదలికలను ట్రాక్ చేసి చివరికి లక్ష్యాన్ని ఛేదించినట్లు సమాచారం. దీంతో ఈ ఆపరేషన్ అత్యంత గోప్యంగా, సాంకేతికంగా అమలు చేసిన దాడిగా అంతర్జాతీయ వర్గాలు చర్చిస్తున్నాయి.

Advertisement