
ఉత్తరమాలిలో పడవ, సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి.. 64 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర మాలిలోని నైజర్ నదిపై గురువారం ఆర్మీ బేస్, ప్రయాణీకుల పడవపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 64 మంది మరణించారని మాలియన్ అధికారి ఒకరు తెలిపారు.
ఉగ్రవాదులు జరిపిన దాడులలో 49 మంది పౌరులు, 15 మంది సైనికులు మరణించారు. నైజర్ నదిపై టింబక్టు పడవ, ఉత్తర గావో ప్రాంతంలోని బాంబా వద్ద ఆర్మీ బేస్ ను లక్ష్యంగాచేసుకొని జిహాదీ ఉగ్రవాదులు దాడులు చేశారు.
ప్రతి దాడిలో ఎంతమంది మరణించారోసమాచారం లేదు. అల్-ఖైదాకు అనుబంధంగా ఉన్న ఒక సమూహం ద్వారా దాడులు జరిగాయి.
"సాయుధ తీవ్రవాద గ్రూపులు" ఉదయం 11 గంటలకు (GMT) పడవపై దాడి చేశాయని మాలియన్ సైన్యం గతంలో సోషల్ మీడియాలో తెలిపింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఉత్తరమాలిలో పడవ, సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి
Terrorists attack Mali passenger boat and army base, 64 deadhttps://t.co/arLX3wpkSG #Terrorists #Attack #Passenger #Boat #And #Army #base #64Dead pic.twitter.com/ieXUOObnpp
— OSPrimeTV (@Os_Primetv) September 8, 2023