NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Ukraine war: ఉక్రెయిన్ కోసం 725 మిలియన్ డాలర్ల ఆయుధ సహాయ ప్యాకేజీ సిద్ధం.. బైడెన్ కీలక నిర్ణయం
    తదుపరి వార్తా కథనం
    Ukraine war: ఉక్రెయిన్ కోసం 725 మిలియన్ డాలర్ల ఆయుధ సహాయ ప్యాకేజీ సిద్ధం.. బైడెన్ కీలక నిర్ణయం
    ఉక్రెయిన్ కోసం 725 మిలియన్ డాలర్ల ఆయుధ సహాయ ప్యాకేజీ సిద్ధం

    Ukraine war: ఉక్రెయిన్ కోసం 725 మిలియన్ డాలర్ల ఆయుధ సహాయ ప్యాకేజీ సిద్ధం.. బైడెన్ కీలక నిర్ణయం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 28, 2024
    09:27 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం (Russia-Ukraine Conflict) తీవ్ర ఉద్రిక్తతలను కలిగిస్తోంది.

    ఈ క్రమంలో, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) కీలకమైన మరో నిర్ణయం తీసుకున్నారు.

    కీవ్‌కు మరిన్ని ఆయుధాలు అందించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది.

    ముఖ్యంగా, తన పదవీ కాలం ముగింపు దశలో ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఈ విషయాన్ని అమెరికా అధికార వర్గాలు అక్కడి మీడియాకు తెలిపారు.

    ఉక్రెయిన్ కోసం సుమారు 725 మిలియన్ డాలర్ల విలువ చేసే ఆయుధాల ప్యాకేజీని సిద్ధం చేస్తోందని సమాచారం.

    ఈ ప్యాకేజీలో ల్యాండ్ మైన్స్, డ్రోన్లు, స్ట్రింగర్ క్షిపణులు, అలాగే హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్స్ (HMARS) ఉన్నాయి.

    వివరాలు 

    పెరిగిన ఆయుధాల వినియోగం

    అంతేకాకుండా, క్లస్టర్ ఆయుధాలు కూడా అందించబోతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

    జో బైడెన్ జనవరి నెలలో పదవీ విరమణ చేయనుండగా, ఉక్రెయిన్ బలపరచడంపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ చర్యలపై అధికారిక ప్రకటన వెలువడనుంది.

    ఇక ప్రెసిడెన్షియల్ డ్రాడౌన్ అథారిటీ (PDA) ద్వారా ఆయుధాల వినియోగం ఇటీవల పెరిగినట్లు తెలుస్తోంది.

    అత్యవసర పరిస్థితుల్లో అమెరికా మిత్రదేశాలకు సాయం అందించేందుకు PDA ఆధారంగా ఆయుధాలను నిల్వ చేయడం జరుగుతుంది.

    వివరాలు 

    ల్యాండ్ మైన్స్ స్వయంగా నిర్వీర్యం అయ్యే విధంగా డిజైన్

    అదేవిధంగా, అమెరికా గత కొన్ని దశాబ్దాలుగా ల్యాండ్ మైన్స్ తయారీని నిలిపివేసినట్లు ప్రకటించింది.

    అయితే, ఉక్రెయిన్‌కు అందించబోయే మైన్స్ ఇప్పటికే నిల్వలో ఉన్నవే అని అమెరికా అధికారులు స్పష్టం చేశారు.

    యుద్ధం ముగిసిన తర్వాత ల్యాండ్ మైన్స్ సరిగా తొలగించకపోతే సాధారణ ప్రజలు తీవ్రంగా నష్టపోతారని సూచించారు.

    అయితే, తాజా ల్యాండ్ మైన్స్ స్వయంగా నిర్వీర్యం అయ్యే విధంగా డిజైన్ చేయబడ్డాయని తెలిపారు.

    బ్యాటరీ ఆధారంగా పనిచేసే ఈ మైన్స్ నాలుగు గంటల నుంచి రెండు వారాల వ్యవధి వరకు మాత్రమే యాక్టివ్‌గా ఉంటాయి.

    ఆ తర్వాత, బ్యాటరీ కాలం ముగియడంతో అవి స్వయంగా నిర్వీర్యం అవుతాయని అధికారులు వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెరికా
    ఉక్రెయిన్

    తాజా

    Prophase: సైబర్ యుద్ధంలో భారత్‌ రక్షణ కవచంగా నిలిచిన 'ప్రొఫేజ్‌' టెక్నాలజీ
    Pillalamarri Banyan Tree: నేడు పాలమూరుని సందర్శించనున్న ప్రపంచ అందగత్తెలు !  తెలంగాణ
    SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గింపు   స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
    unemployment data: దేశంలో తొలిసారిగా నెలవారీ ఉద్యోగ గణాంకాలు.. ఏప్రిల్‌లో నిరుద్యోగ రేటు 5.1శాతం కేంద్ర ప్రభుత్వం

    అమెరికా

    Iran- Israel: ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేపడితే.. దానికి పూర్తి బాధ్యత అమెరికాదే.. ఇరాన్ హెచ్చరిక  ఇరాన్
    McDonald's E. coli outbreak: అమెరికాలో మెక్‌డొనాల్డ్‌ బర్గర్‌ల కారణంగా 'ఇ.కోలి' .. ఒకరి మృతి  అంతర్జాతీయం
    Pannun murder plot: 'పన్నూ హత్య కేసు'పై అమెరికా స్పందన.. బాధ్యులను గుర్తించండి ఇండియా
    US elections: అమెరికా ముందస్తు ఎన్నికల్లో రికార్డు ఓటింగ్.. 2.1 కోట్ల మంది ఓటు హక్కు వినియోగం ప్రపంచం

    ఉక్రెయిన్

    కాళీ దేవతపై ఉక్రెయిన్ అనుచిత ట్వీట్; భారతీయులకు క్షమాపణలు చెప్పిన ఆ దేశ మంత్రి  భారతదేశం
    రష్యా ప్రతినిధిపై చేయి చేసుకున్న ఉక్రెయిన్ ఎంపీ.. జెండా లాక్కున్నాడని పిడిగుద్దులుE రష్యా
    మోదీజీ, యుద్ధాన్ని ముగించే శాంతి ప్రతిపాదనకు మద్దతు తెలపండి; జెలెన్‌స్కీ అభ్యర్థన నరేంద్ర మోదీ
    ఉక్రెయిన్‌పై రాహుల్ కీలక వ్యాఖలు; భారత్ వైఖరిని సమర్థించిన రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025