Page Loader
Bangladesh: బంగ్లాదేశ్‌ ఎన్నికలపై తాత్కాలిక ప్రభుత్వ అధినేత యూనస్‌ కీలక వ్యాఖ్యలు 
బంగ్లాదేశ్‌ ఎన్నికలపై తాత్కాలిక ప్రభుత్వ అధినేత యూనస్‌ కీలక వ్యాఖ్యలు

Bangladesh: బంగ్లాదేశ్‌ ఎన్నికలపై తాత్కాలిక ప్రభుత్వ అధినేత యూనస్‌ కీలక వ్యాఖ్యలు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 16, 2024
12:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతున్న వేళ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది చివరలో లేదా 2026 ప్రారంభంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని ఆయన స్టేట్ టెలివిజన్ ద్వారా వెల్లడించారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఎన్నికలలో షేక్ హసీనా మరోసారి గెలిచారు. ఆమె నేతృత్వంలో అవామీ లీగ్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది. అయితే ప్రతిపక్ష పార్టీలు ఆ ఎన్నికలకు దూరంగా ఉండటంతో అవామీ లీగ్‌కు ఏమీ ప్రతిస్పందన లేకుండా గెలుపు సాధించింది. ఈ ఎన్నికల ప్రక్రియపై అంతర్జాతీయ ఆందోళనలు మొదలయ్యాయి.

Details

ఓటర్ల జాబితాను సవరించాలి

తర్వాత రిజర్వేషన్లపై విద్యార్థుల ఆందోళనలు తీవ్రహింసాత్మకంగా మారడంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. ఆందోళనలు అలా తీవ్రంగా ఉండటంతో హసీనా దేశాన్ని వదిలి భారత్‌లో ఆశ్రయం పొందారు. ఆమె రాజీనామాతో అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోయింది. ప్రస్తుతం మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం కొనసాగుతోంది. భవిష్యత్తులో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంస్కరణలు, ఓటర్ల జాబితా సవరించేందుకు సమయం తీసుకోవాలని ఆయన చెప్పారు.