Khamenei: ఖమేని మరణం.. కర్ణాటకలోని ఆ గ్రామంలో విషాదం!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్అలీ ఖమేనీ మరణించినట్లు సమాచారం. ఈ వార్తతో ప్రపంచవ్యాప్తంగా ఆయన మద్దతుదారులు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు. భారత్లో కూడా పలు ప్రాంతాల్లో ఖమేనీ మద్దతుదారులు సంఘీభావ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లాకు చెందిన 'అలీపుర' గ్రామం కూడా ఈ విషయంలో శోకసంద్రంలో మునిగింది. ఇది దాదాపు నలభై ఏళ్ల క్రితం ఖమేనీ పర్యటనకు సంబంధిత సంఘటనల కారణంగా ప్రత్యేక ప్రాధాన్యం పొందింది.
Details
అలీపుర గ్రామం నేపథ్యం
అలీపుర గ్రామంలో సుమారు 30,000 మంది నివసిస్తున్నారు. వీరిలో ఎక్కువమంది షియా ముస్లింలు. అందువల్ల గ్రామాన్ని తరచుగా 'మినీ ఇరాన్'గా పిలుస్తారు. ఖమేనీ పర్యటన, ప్రభావం 1986లో ఖమేనీ భారత్ పర్యటనలో భాగంగా అలీపురను సందర్శించారు. గ్రామస్థుల ఆహ్వానంపై ఆయన స్థానిక ప్రజలు, మత పెద్దలతో నేరుగా ముచ్చటించారు. ఖమేనీ గౌరవార్థంగా గ్రామంలో ఓ ఆసుపత్రిని నిర్మించారు. ఈ విధంగా ఇరాన్ మరియు అలీపుర మధ్య బలమైన సాంస్కృతిక సంబంధాలు ఏర్పడ్డాయని స్థానికులు గుర్తుచేస్తున్నారు. అనేక కుటుంబాలు ఉన్నత విద్య కోసం అక్కడికి వెళ్లి ఉద్యోగాలు చేసుకుంటూ స్థిరపడినట్లు తెలిపారు.
Details
తాజా స్పందనలు
అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ మరణ వార్తతో అలీపుర గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన ఆత్మశాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మూడు రోజులపాటు గ్రామంలో సంతాప దినాలను ప్రకటించారు. దుకాణాలు, వ్యాపార సంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు. అన్ని రకాల వేడుకలు, బహిరంగ సభలు నిలిపివేయాలని ప్రకటించారు.
Details
ఖమేనీ భారత్ పర్యటన - కశ్మీర్
భారత పర్యటన సమయంలో ఖమేనీ కశ్మీర్లో కూడా పర్యటించారు. శ్రీనగర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన 15 నిమిషాల ప్రసంగం చేశారు. స్థానిక ముస్లిం వర్గాల్లో ఈ ప్రసంగం కీలక మార్పు తెచ్చినట్లు విశ్వసిస్తారు. అప్పటి ఇరాన్ పాలనా బాధ్యతలను ఖమేనీ స్వీకరించలేదు. 2012లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ టెహ్రాన్ పర్యటనలో, ఖమేనీ తన భారత పర్యటనను గుర్తు చేసుకున్నారు.