LOADING...
Lawrence Bishnoi: కెనడాకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరిక.. 1,000 మంది షూటర్లు సిద్ధంగా ఉన్నారంటూ లేఖ!
1,000 మంది షూటర్లు సిద్ధంగా ఉన్నారంటూ లేఖ!

Lawrence Bishnoi: కెనడాకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరిక.. 1,000 మంది షూటర్లు సిద్ధంగా ఉన్నారంటూ లేఖ!

వ్రాసిన వారు Sirish Praharaju
May 29, 2026
02:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

కెనడాలో పెరుగుతున్న వసూళ్ల (ఎక్స్‌టార్షన్) సంక్షోభం వెనుక కీలక పాత్ర పోషిస్తున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తాజాగా మరోసారి సంచలనానికి కారణమైంది. ఈ గ్యాంగ్‌కు చెందినవారు బ్రిటిష్ కొలంబియా పోలీసులకు పంపిన ఓ లేఖలో దేశవ్యాప్తంగా కాల్పులు జరిపేందుకు 1,000 మంది గన్‌మెన్ సిద్ధంగా ఉన్నారని హెచ్చరించినట్లు సమాచారం. ఈ విషయాన్ని గురువారం జరిగిన ఓ డిపోర్టేషన్ విచారణలో పోలీసు అధికారి వెల్లడించారు.

వివరాలు 

అబాట్స్‌ఫోర్డ్ పోలీస్ స్టేషన్‌కు లేఖ

గ్లోబల్ న్యూస్ కథనం ప్రకారం, 2025 ఆగస్టు 13న బ్రిటిష్ కొలంబియాలోని అబాట్స్‌ఫోర్డ్ పోలీస్ స్టేషన్‌కు ఈ లేఖ పంపబడింది. ఎడ్మంటన్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ ఎక్స్‌టార్షన్ గ్యాంగ్ సభ్యుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి డిపోర్టేషన్ విచారణ సందర్భంగా కానిస్టేబుల్ కెవిన్ సెయింట్ లూయిస్ ఈ విషయాన్ని వెల్లడించారు. "ఆ లేఖలో తమ నేర సంస్థ నిర్మాణం గురించి వివరించారు. అలాగే, తమ వద్ద 1,000 మందికి పైగా వ్యక్తులు ఉన్నారని, అవసరమైతే కాల్పులకు సిద్ధంగా ఉంటారని పేర్కొన్నారు" అని ఆయన తెలిపారు.

వివరాలు 

వ్యాపార సంస్థలు 'ట్యాక్స్' చెల్లించాలని సూచన

ఆ లేఖలో వ్యాపార సంస్థలు తమ "ట్యాక్స్" చెల్లించాలని కూడా సూచించినట్లు తెలుస్తోంది. దీనిని దర్యాప్తు అధికారులు ఎక్స్‌టార్షన్ డబ్బుల కోసం చేసిన బెదిరింపుగా భావించారు. విచారణ అనంతరం అబాట్స్‌ఫోర్డ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ కూడా ఆ లేఖ అందిన విషయాన్ని ధృవీకరించింది. సార్జెంట్ పాల్ వాకర్ మాట్లాడుతూ, ఆ లేఖకు సంబంధించిన వివరాలను కెనడా వ్యాప్తంగా ఉన్న చట్ట అమలు సంస్థలతో పంచుకున్నామని తెలిపారు. ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న ఎక్స్‌టార్షన్ కేసులను అరికట్టేందుకు సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

Advertisement

వివరాలు 

లేఖ వివరాలపై అధికారులు మౌనం

అబాట్స్‌ఫోర్డ్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఎక్స్‌టార్షన్ టాస్క్‌ఫోర్స్ అధికారులు లేఖ మూలం, అందులోని అంశాలపై విచారణ జరిపారు. అయితే దర్యాప్తు కొనసాగుతున్నందున మరిన్ని వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. ఈ విచారణలో జషన్‌దీప్ సింగ్ అనే వ్యక్తి పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. అతను ఎడ్మంటన్ కేంద్రంగా పనిచేస్తున్న ఎక్స్‌టార్షన్ గ్యాంగ్‌లో సభ్యుడిగా ఉన్నాడని, అల్బర్టా, బ్రిటిష్ కొలంబియా, ఒంటారియో ప్రాంతాల్లో జరిగిన కాల్పుల ఘటనలతో సంబంధాలు ఉన్నాయని అధికారులు ఆరోపిస్తున్నారు.

Advertisement

వివరాలు 

వాట్సాప్ కాల్స్, మెసేజ్‌ల ద్వారా బెదిరింపులు

దర్యాప్తు సంస్థల సమాచారం ప్రకారం, బాధితులకు వాట్సాప్ కాల్స్, సందేశాల ద్వారా ఎక్స్‌టార్షన్ బెదిరింపులు పంపుతున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా లారెన్స్ బిష్ణోయ్ లేదా గోల్డీ బ్రార్ పేర్లను ఉపయోగించి భయాందోళనలు సృష్టిస్తున్నారని తెలిపారు. ఇంకో అనుమానిత గ్యాంగ్ అనుచరుడు జోరా సిద్ధూ కెనడా వెలుపల నుంచి ఈ కమ్యూనికేషన్ వ్యవహారాలను నిర్వహిస్తున్నాడని పోలీసులు భావిస్తున్నారు. దక్షిణాసియా మూలాలున్న కెనడియన్లను లక్ష్యంగా చేసుకున్న ఈ ఎక్స్‌టార్షన్ నెట్‌వర్క్‌లపై దర్యాప్తులో భాగంగా అధికారులు వాయిస్ మ్యాచింగ్ టెక్నాలజీని కూడా ఉపయోగిస్తున్నట్లు సమాచారం.

వివరాలు 

ఆయుధాల గుర్తింపులో కెనడా పోలీసులకు సవాళ్లు

ఎక్స్‌టార్షన్‌కు సంబంధించిన నేరాల్లో ఉపయోగిస్తున్న తుపాకులను గుర్తించడం కెనడా పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. నిందితులు ఆయుధాలను ఒక ప్రావిన్స్ నుంచి మరో ప్రావిన్స్‌కు వేగంగా తరలిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఒక పోలీసు అధికారి విచారణలో వెల్లడించిన వివరాల ప్రకారం, ఎక్స్‌టార్షన్ కాల్పుల్లో ఉపయోగించిన ఒక తుపాకి కేవలం 24 గంటల వ్యవధిలో రెండు వేర్వేరు ప్రావిన్స్‌లలో వినియోగించబడింది. దీంతో ఆయుధాలను గుర్తించి స్వాధీనం చేసుకోవడం మరింత క్లిష్టంగా మారిందన్నారు. ఇదిలా ఉండగా, కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ ఈ ఏడాది మే నాటికి ఎక్స్‌టార్షన్ అనుమానితులపై వందల సంఖ్యలో దర్యాప్తులు ప్రారంభించి, పలువురిపై దేశ బహిష్కరణ ఆదేశాలు కూడా జారీ చేసినట్లు సమాచారం.

Advertisement