LOADING...
LPG Vessel: పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య భారత్‌ వైపు ఎల్పీజీ నౌక ప్రయాణం
పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య భారత్‌ వైపు ఎల్పీజీ నౌక ప్రయాణం

LPG Vessel: పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య భారత్‌ వైపు ఎల్పీజీ నౌక ప్రయాణం

వ్రాసిన వారు Sirish Praharaju
May 03, 2026
11:37 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు, వాయువు సరఫరాలు అంతరాయానికి గురవుతున్నాయి. ఈనేపథ్యంలో భారత్‌కు రావాల్సిన ఒక ఎల్పీజీ నౌక హర్మూజ్‌ జలసంధిని విజయవంతంగా దాటింది. మార్షల్‌ దీవుల జెండాతో నడుస్తున్నఎంటీ 'సర్వ్‌ శక్తి' నౌక 46వేల మెట్రిక్‌ టన్నులకు పైగా ఎల్పీజీని తీసుకుని భారత్‌ దిశగా ప్రయాణిస్తోంది. ఈ నౌకలో మొత్తం 20మంది సిబ్బంది ఉండగా,అందులో 18మంది భారతీయులే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నౌక రాకకు ప్రాధాన్యం ఏర్పడింది. మే 13న విశాఖపట్నం నౌకాశ్రయానికి ఈ నౌక చేరుకునే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటీవల అమెరికా నౌకల దిగ్బంధనం అనంతరం భారత్‌కు చేరనున్న తొలి ఎల్పీజీ నౌక ఇదే కావడం విశేషంగా నిలిచింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య భారత్‌ వైపు ఎల్పీజీ నౌక

Advertisement