Lufthansa: యూదు ప్రయాణీకులను విమానం ఎక్కకుండా అడ్డుకొన్న లుఫ్తాన్సా.. $4 మిలియన్ల జరిమానా విధించిన అధికారులు
జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్లైన్స్కు అమెరికా అధికారాలు భారీగా జరిమానా విధించారు. 2022లో 128 మంది యూదు ప్రయాణికులను ఆ విమాన సిబ్బంది ఎక్కనివ్వకుండా అడ్డుకున్నారు. ఈ ఘటనపై అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ 4 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. అప్పుడు కొవిడ్ నిబంధనలు అమలులో ఉన్నాయి. అమెరికాలోని ఫ్రాంక్ఫర్ట్ నుండి జర్మనీకి వెళుతున్న విమానంలో కొందరు యూదు ప్రయాణికులు నిబంధనలు పాటించలేదని నాటి విమాన కెప్టెన్ విమానయాన సంస్థకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుతో మొత్తం 128 మంది యూదులను బోర్డింగ్కు అనుమతించలేదు. వారి దుస్తులు, నల్లటి టోపీలు, జాకెట్స్ను చూసి మొత్తం ఒకే గ్రూపు అని భావించారు. కానీ వాస్తవానికి వీరిలో చాలామందికి పరస్పర పరిచయం కూడా లేదు.
అమెరికా డివోటీ అధికారులు దర్యాప్తు
ఈ ఘటనను జాతి వివక్షగా భావించి 40 మంది నుండి ఫిర్యాదులు అందించడంతో, అమెరికా డివోటీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. వారి వేషధారణ యూదుల వలే కనిపించడంతో, లుఫ్తాన్సా వారు బోర్డింగ్కు అనుమతించలేదని గుర్తించారు. దాంతో, 4 మిలియన్ డాలర్ల జరిమానా విధించారు. మరోవైపు, లుఫ్తాన్సా తమ సిబ్బంది జాతి వివక్ష చూపించలేదని బలంగావాదిస్తోంది.