NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Nepal: నేపాల్‌లో 6.4 తీవ్రతతో భారీ భూకంపం.. 128 మంది మృతి
    తదుపరి వార్తా కథనం
    Nepal: నేపాల్‌లో 6.4 తీవ్రతతో భారీ భూకంపం.. 128 మంది మృతి
    నేపాల్‌లో 6.4 తీవ్రతతో భారీ భూకంపం.. 128 మంది మృతి

    Nepal: నేపాల్‌లో 6.4 తీవ్రతతో భారీ భూకంపం.. 128 మంది మృతి

    వ్రాసిన వారు Stalin
    Nov 04, 2023
    08:10 am

    ఈ వార్తాకథనం ఏంటి

    నేపాల్‌ను భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.4గా నమోదైంది.

    ఈ భూకంపం వల్ల ఇప్పటి వరకు నేపాల్‌లో మరణించిన వారి సంఖ్య 128కి చేరుకుందని రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది.

    పశ్చిమ నేపాల్‌లోని జాజర్‌కోట్ మరియు రుకుమ్ జిల్లాల్లో 140 మందికి పైగా గాయపడినట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే నేపాల్ టెలివిజన్ పేర్కొంది.

    జాజర్‌కోట్‌లోని లామిదండా ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

    క్షతగాత్రులను తక్షణమే రక్షించేందుకు, సహాయం చేసేందుకు దేశంలోని మూడు భద్రతా ఏజన్సీలను మోహరించినట్లు నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ కార్యాలయం తెలిపింది.

    భూకంపం నేపథ్యంలో శుక్రవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో దిల్లీతో పాటు ఉత్తర భారతంలో ప్రకంపనలు వచ్చాయి.

    నేపాల్

    భారీగా ఆస్తి, ప్రాణ నష్టం 

    భూకంపం వల్ల దైలేఖ్, సల్యాన్, రోల్పా జిల్లాలతో సహా ఇతర జిల్లాల్లో భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు వస్తున్నాయని నేపాల్ హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.

    గాయపడిన వ్యక్తులు ఖాట్మండుకు పశ్చిమాన 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాజర్‌కోట్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

    హిమాలయ దేశమైన నేపాల్‌లో భూకంపాలు సర్వసాధారణంగా వస్తుంటాయి.

    అక్టోబరు 3న 6.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీని వల్ల దిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ప్రకంపనలు సంభవించాయి.

    నవంబర్ 2022 లో, దోటి జిల్లాలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించి ఆరుగురు మరణించారు. 2015లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 12,000 మందికి పైగా మరణించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మరణాలు పెరిగే అవకాశం

    More then 128 people died and above 500 were injured after a strong 6.4 magnitude earthquake in Nepal... #Nepal #NepalEarthquake #earthquakenepal #earthquake #BREAKING_NEWS #latestnews #NepalNews #Jajarkot #Kathmandu pic.twitter.com/6c4MILmvaY

    — Vikas Bailwal (@VikasBailwal4) November 4, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నేపాల్
    భూకంపం
    తాజా వార్తలు
    దిల్లీ

    తాజా

    Ghaati : ఘాటి రిలీజ్ డేట్ ఫిక్స్‌.. జూలై 11న గ్రాండ్ రిలీజ్‌! టాలీవుడ్
    UAE Golden Visa: UAE గోల్డెన్ వీసా అంటే ఏమిటి? భారతీయులు దరఖాస్తు చేసుకోవచ్చా? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
    RBI: రూ.2,000 నోట్లు వెనక్కి తీసుకున్నా... ఇంకా వేల కోట్ల రూపాయలు తిరిగిరాలేదు! ఆర్ బి ఐ
    EPFO: ELI పథకం కోసం ఈపీఎఫ్‌వో UAN యాక్టివేషన్‌ గడువు పెంపు ఈపీఎఫ్ఓ

    నేపాల్

    నేపాల్‌ విమాన ప్రమాదం: ఐదుగురు భారతీయులు సహా 15మంది విదేశీ ప్రయాణికులు దుర్మరణం విమానం
    నేపాల్ విమాన ప్రమాదం: చనిపోవడానికి ముందు ఫేస్‌బుక్ లైవ్, ఆ నలుగురూ స్నేహితులే! విమానం
    నేపాల్ విమాన ప్రమాదం: కీలకమైన రెండు బ్లాక్ బాక్స్‌లు స్వాధీనం విమానం
    ఈ దేశాల్లో మన రూపాయి వీలువ చాలా ఎక్కువ, అవేంటో తెలుసా? జీవనశైలి

    భూకంపం

    జమ్మూ కాశ్మీర్‌లోని కత్రాలో తెల్లవారుజామున భూకంపం జమ్ముకశ్మీర్
    భూకంపం: 11రోజులుగా శిథిలాల కింద సజీవంగా ముగ్గురు; టర్కీ, సిరియాలో 45,000 దాటిన మరణాలు టర్కీ
    టర్కీలో మరోసారి వరసుగా రెండు భూకంపాలు; అదనపు సాయానికి ముందుకొచ్చిన ఐక్యరాజ్య సమితి టర్కీ
    భవిష్యత్‌లో భారత్‌కు భారీ భూకంపాల ముప్పు ; నిపుణుల హెచ్చరిక భారతదేశం

    తాజా వార్తలు

    Telangana TDP: టీడీపీ కీలక నిర్ణయం.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరం తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    'ప్రీమియర్ పద్మి' టాక్సీకి బై.. బై.. ముంబైలో ఒక శకం ముగిసింది.. 6దశాబ్దాల బంధానికి తెర  ముంబై
    కేరళ పేలుళ్లకు బాధ్యత వహిస్తూ పోలీసుల ఎదుట లొంగిపోయిన వ్యక్తి  కేరళ
    18,000 పరుగులు.. 12 హాఫ్ సెంచరీలు.. ఇంగ్లాండ్‌‌తో మ్యాచ్‌లో  రోహిత్ సాధించిన ఘనతలు ఇవే.. రోహిత్ శర్మ

    దిల్లీ

    ఖలిస్థానీ ఉగ్రవాదులు-గ్యాంగ్‌స్టర్ల బంధంపై ఎన్ఐఏ ఫోకస్.. దేశవ్యాప్తంగా 50చోట్ల సోదాలు  ఎన్ఐఏ
    ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి షాక్.. సీబీఐ విచారణకు హోం మంత్రిత్వ శాఖ ఆదేశం అరవింద్ కేజ్రీవాల్
    ముగ్గురు ఐసీస్ ఉగ్రవాదులపై రూ.3లక్షల రివార్డు ప్రకటించిన ఎన్ఐఏ ఎన్ఐఏ
    మహాత్మా గాంధీ జయంతి: రాజ్‌ఘాట్‌ వద్ద ప్రధాని మోదీ సహా ప్రముఖుల నివాళులు  నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025