NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / India- Maldives: భారత టూరిస్టులకు మాల్దీవుల అధ్యక్షుడు ప్రత్యేక విజ్ఞప్తి
    తదుపరి వార్తా కథనం
    India- Maldives: భారత టూరిస్టులకు మాల్దీవుల అధ్యక్షుడు ప్రత్యేక విజ్ఞప్తి
    భారత టూరిస్టులకు మాల్దీవుల అధ్యక్షుడు ప్రత్యేక విజ్ఞప్తి

    India- Maldives: భారత టూరిస్టులకు మాల్దీవుల అధ్యక్షుడు ప్రత్యేక విజ్ఞప్తి

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 07, 2024
    01:38 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు నాలుగు రోజుల పర్యటన కోసం భారత్‌కు విచ్చేశారు.

    ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, భారత టూరిస్టులు మాల్దీవులకు రావాలని ఆహ్వానిస్తూ, వారు తమ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపిస్తున్నారని పేర్కొన్నారు.

    ముయిజ్జు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, ఆయన తీసుకున్న నిర్ణయాలు, మంత్రుల చేసిన వ్యాఖ్యలతో భారత్‌-మాల్దీవుల మధ్య సంబంధాల్లో ఒడిదుడుకులు చోటుచేసుకున్నాయి.

    ఈ నేపథ్యంలోనే ముయిజ్జు నుంచి ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి.

    వివరాలు 

    స్నేహితులపై గౌరవంతో వ్యవహరించడం మా డీఎన్‌ఏలో ఉంది: ముయిజ్జు 

    ''భారత భద్రతను బలహీనపరిచేలా మాల్దీవులు వ్యవహరించదు. న్యూదిల్లీ మాకు విలువైన భాగస్వామి. రక్షణ సహా ఇతర రంగాల్లో ప్రాధాన్యం ఉంటుంది. మేం వివిధ రంగాల్లో ఇతర దేశాలతో సహకారాన్ని పెంపొందించుకుంటున్నప్పుడు.. మా చర్యలు మా ప్రాంత భద్రత, స్థిరత్వంపై రాజీ లేకుండా ఉండేలా చూసుకుంటాం. మా పొరుగువారు, స్నేహితులపై గౌరవంతో వ్యవహరించడం మా డీఎన్‌ఏలో ఉంది'' అని వెల్లడించారు.

    అలాగే, ''మాల్దీవ్స్ ఫస్ట్'' విధానం గురించి మాట్లాడుతూ, ''అంతర్జాతీయ సంబంధాల్లో వైవిధ్యతను చూపడం మాల్దీవులకు చాలా అవసరం. అలాగే ఏ ఒక్క దేశం పైనా అతిగా ఆధారపడటం తగ్గించుకోవాల్సి ఉంది'' అని అన్నారు.

    వివరాలు 

    భారత్‌లో అక్టోబర్ 10 వరకు ముయిజ్జు 

    ఈసందర్భంగానే భారత టూరిస్టులకు ఆహ్వానం పలికారు. ఈ నేపథ్యంలోనే మోదీ ఈ ఏడాది జనవరిలో లక్షద్వీప్‌లో పర్యటించగా, అక్కడ సముద్రంలో స్నార్కెలింగ్‌ చేసి, ఫొటోలు షేర్‌ చేశారు.

    నెటిజన్లు ఈ పర్యటన స్థానిక పర్యటక రంగానికి ప్రోత్సాహమని అభిప్రాయపడ్డారు.

    అయితే, మాల్దీవుల మంత్రులు ఆ సమయంలో విమర్శలు చేయడంతో, సోషల్‌ మీడియాలో ''బాయ్‌కాట్ మాల్దీవ్స్‌'' హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అయ్యింది.

    ప్రస్తుతం, ముయిజ్జు అక్టోబర్ 10 వరకు భారత్‌లో పర్యటించనున్నారు.

    ఇరుదేశాల మధ్య ఇటీవల తలెత్తిన వివాదాల అనంతరం ముయిజ్జు భారత్‌లో పర్యటించడం ఇది రెండోసారి.

    మోదీ ప్రమాణ స్వీకారానికి ఆయన హాజరు కావడంతో మాల్దీవుల వైఖరిలో మార్పు కనిపించిందని సంకేతాలు వచ్చాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మాల్దీవులు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    మాల్దీవులు

    మాల్దీవుల్లో భారత హైకమిషన్‌పై దాడికి కుట్ర.. స్పందించిన విదేశాంగ శాఖ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి
    #Boycott Maldives: భారత్‌పై మాల్దీవ్స్ నేతల అక్కసు.. ట్రెండింగ్‌లో బాయ్‌కాట్ మాల్దీవ్స్ హ్యాష్‌ట్యాగ్  లక్షదీవులు
    Maldives: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. ఇద్దరు మంత్రులను సస్పెండ్ చేసిన మాల్దీవులు సర్కార్  తాజా వార్తలు
    Lakshadweep MP: మోదీ భారత పర్యాటకంపై స్పందిస్తే మాల్దీవులకు వచ్చిన సమస్య ఏంటి?: లక్షద్వీప్ ఎంపీ నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025