NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / India-Maldives: త్వరలో అధికారికంగా భారత్‌లో పర్యటించనున్న మాల్దీవుల ప్రెసిడెంట్ ముయిజ్జూ
    తదుపరి వార్తా కథనం
    India-Maldives: త్వరలో అధికారికంగా భారత్‌లో పర్యటించనున్న మాల్దీవుల ప్రెసిడెంట్ ముయిజ్జూ
    భారత్‌లో పర్యటించనున్న మాల్దీవుల ప్రెసిడెంట్ ముయిజ్జూ

    India-Maldives: త్వరలో అధికారికంగా భారత్‌లో పర్యటించనున్న మాల్దీవుల ప్రెసిడెంట్ ముయిజ్జూ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 11, 2024
    08:40 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మయుజ్జు త్వరలో అధికారికంగా భారత్‌లో పర్యటించనున్నట్లు మాల్దీవుల అధ్యక్ష భవనం ఒక ప్రకటనలో తెలిపింది.

    ఆయన గత సంవత్సరం నవంబరులో మాల్దీవులు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది భారత్‌లో పర్యటించడం రెండవ సారి.

    మొదటిసారి ఆయన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడవసారి ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.

    ఇప్పుడు ఆయన అధికారిక పర్యటనకు రావాలని నిర్ణయించుకున్నారని మాల్దీవుల అధ్యక్ష భవనం ప్రకటించింది, అయితే పర్యటనకు సంబంధించిన ఖచ్చితమైన తేదీలు ఇంకా తెలియజేయలేదు.

    వివరాలు 

     మయుజ్జు అధ్యక్షుడిగా మొదటి విదేశీ పర్యటన తుర్కియే,చైనాలో..

    చైనా అనుకూలంగా పేరున్న మయుజ్జు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, మునుపటి అధ్యక్షుల్లా కాకుండా తన మొదటి విదేశీ పర్యటనను తుర్కియే,చైనాలో నిర్వహించారు.

    ఈ క్రమంలో భారత్‌-మాల్దీవుల మధ్య సంబంధాలు కూడా బలహీనపడ్డాయి.మాల్దీవుల నుండి భారత బలగాలు వెళ్ళిపోవాలని మయుజ్జు పెట్టిన షరతు ఈ పరిణామాలకు దారితీసింది.

    అలాగే,భారత ప్రధానమంత్రి మోదీ ఈ ఏడాది లక్షద్వీప్‌లో పర్యటించిన సమయంలో మాల్దీవుల మంత్రులు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య దూరాన్ని మరింత పెంచాయి.

    ఈ వ్యాఖ్యల కారణంగా సోషల్‌ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమై,'బాయ్‌కాట్ మాల్దీవ్స్'హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అయింది.

    అయితే,ఈ వ్యాఖ్యలకు తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని మాల్దీవుల ప్రభుత్వం స్పష్టం చేసింది.ఆ వ్యాఖ్యలు చేసిన మంత్రులపై చర్యలు తీసుకుంది.

    వివరాలు 

     మాల్దీవులకు భారత విదేశాంగ మంత్రి జైశంకర్

    జూన్ 9న ముయుజ్జు మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.

    ఇటీవల భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మాల్దీవులకు పర్యటించిన విషయం తెలిసిందే.

    ఈ నేపథ్యంలో మయుజ్జు ఇప్పుడు అధికారికంగా భారత్ పర్యటించనున్నారని ప్రకటించడం విశేషం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మాల్దీవులు

    తాజా

    NTR: బ్రహ్మర్షి నుంచి భీమ్‌దాకా... ఎన్టీఆర్‌ స్టార్ హీరోగా ఎదిగిన ప్రయాణమిదీ! జూనియర్ ఎన్టీఆర్
    Jammu Kashmir: పూంచ్‌లో పాకిస్తాన్  లైవ్‌ షెల్‌..ధ్వంసం చేసిన భారత ఆర్మీ  జమ్ముకశ్మీర్
    India-US: భారత్‌,అమెరికా మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై త్వరితగతిన అడుగులు  పీయూష్ గోయెల్‌
    Ajith: పని చేసుకుంటూ రేసింగ్‌లో పాల్గొన్నా.. చిన్ననాటి కష్టాలు గుర్తు చేసుకున్న అజిత్ అజిత్ కుమార్

    మాల్దీవులు

    మాల్దీవుల్లో భారత హైకమిషన్‌పై దాడికి కుట్ర.. స్పందించిన విదేశాంగ శాఖ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి
    #Boycott Maldives: భారత్‌పై మాల్దీవ్స్ నేతల అక్కసు.. ట్రెండింగ్‌లో బాయ్‌కాట్ మాల్దీవ్స్ హ్యాష్‌ట్యాగ్  లక్షదీవులు
    Maldives: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. ఇద్దరు మంత్రులను సస్పెండ్ చేసిన మాల్దీవులు సర్కార్  నరేంద్ర మోదీ
    Lakshadweep MP: మోదీ భారత పర్యాటకంపై స్పందిస్తే మాల్దీవులకు వచ్చిన సమస్య ఏంటి?: లక్షద్వీప్ ఎంపీ లక్షదీవులు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025