NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Masood Azhar : జైషే మహ్మద్‌ అధినేత మృతి.. బాంబు దాడిలో ప్రాణం విడిచిన మసూద్‌ అజహర్‌! 
    తదుపరి వార్తా కథనం
    Masood Azhar : జైషే మహ్మద్‌ అధినేత మృతి.. బాంబు దాడిలో ప్రాణం విడిచిన మసూద్‌ అజహర్‌! 
    బాంబు దాడిలో ప్రాణం విడిచిన మసూద్‌ అజహర్‌

    Masood Azhar : జైషే మహ్మద్‌ అధినేత మృతి.. బాంబు దాడిలో ప్రాణం విడిచిన మసూద్‌ అజహర్‌! 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jan 01, 2024
    06:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్‌ అజహర్‌ మృతి చెందారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన బాంబు దాడిలో అజహర్ హతమైనట్లు తెలుస్తోంది.

    పాకిస్థాన్‌'లో గత కొన్ని నెలలుగా గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో ఉగ్రవాదులు హతమవుతున్నారు. తాజాగా జైషే మహ్మద్‌ చీఫ్‌, పుల్వామా దాడి మాస్టర్‌ మైండ్‌ మసూద్‌ అజహర్‌(Masood Azhar)పై జరిగిన బాంబు దాడిలో అతడు మరణించినట్లు సామాజిక మాధ్యమాల్లో సమాచారం.

    ఉదయం 5 గంటల సమయంలో పాక్‌లోని భవల్‌పూర్‌ మసీదు నుంచి మసూద్‌ తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు బాంబు దాడికి పాల్పడ్డారు. ఘటనలో మసూద్ అజహర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు కథనాలు ప్రసారం అవుతున్నాయి.

    details

    1995లో భారత్ అరెస్ట్ చేసింది..

    మసూద్‌పై బాంబు దాడి జరిగినట్లుగా పేర్కొంటూ వైరల్‌ అవుతున్న వీడియో పాతదని తెలుస్తోంది.

    మసూద్‌ అజహర్‌ను ఇప్పటికే ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.అతడు పాక్‌లోనే ఉన్నట్లు ఇప్పటికీ ఆ దేశం అంగీకరించలేదు.

    పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్‌ ఉగ్రముఠా అధినేత అయిన మసూద్‌,భారత్‌లో పలు భీకర దాడులకు సూత్రధారి.

    1995లో భారత్‌ అతడిని అరెస్ట్ చేయగా 1999లో కొందరు ఉగ్రవాదులు విమానాన్ని హైజాక్‌ చేసి అతడిని విడిపించుకున్నారు.

    అనంతరం జైషే ఉగ్రసంస్థను స్థాపించి 2001లో పార్లమెంట్‌పై జరిగిన ఉగ్రదాడి,2008లో ముంబయిలో జరిగిన బాంబు పేలుళ్లలోనూ నిందితుడిగా ఉన్నాడు.

    2019లో జమ్మూకశ్మీర్‌లో పుల్వామాలో సైనికుల కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడిలో 40మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడం వెనుక మసూద్‌ హస్తం ఉందని భారత్ ప్రకటించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉగ్రవాదులు

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఉగ్రవాదులు

    జమ్మూకశ్మీర్‌లో కాల్పులు.. నంద్యాల యువజవాన్ వీర మరణం  నంద్యాల
    సిరియాలో టెర్రర్ దాడులు.. ఘర్షణల్లో మరణించిన ఐఎస్ఐఎస్ చీఫ్ ఖురాషీ  సిరియా
    Jammu Kashmir: కుల్గామ్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు; ముగ్గురు ఆర్మీ జవాన్లు వీరమరణం  జమ్ముకశ్మీర్
    Jammu and Kashmir: నియంత్రణ రేఖ వద్ద ఎన్‌కౌంటర్; ఇద్దరు ఉగ్రవాదులు హతం  జమ్ముకశ్మీర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025