Pakistan: పాకిస్థాన్లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం.. Mi-17 కూలి 21 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ సైన్యానికి చెందిన Mi-17 ఆర్మీ ఏవియేషన్ హెలికాప్టర్ బుధవారం ఘోర ప్రమాదానికి గురైంది. ముజఫ్ఫరాబాద్ సమీపంలో ఈ హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న మొత్తం 21 మంది సైనిక సిబ్బంది మృతి చెందినట్లు పాకిస్థాన్ మీడియా వెల్లడించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు అధికారులు విచారణ ప్రారంభించారు.
వివరాలు
పాకిస్థాన్ సైన్యంలో తీవ్ర విషాదం
ఈ Mi-17 హెలికాప్టర్ పాకిస్థాన్ భద్రతా దళాలకు చెందిన సైనికులను తీసుకుని పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లోని నీలమ్ వ్యాలీ సెక్టార్కు వెళ్తున్నట్లు సమాచారం. టేకాఫ్ అనంతరం కొద్ది సేపటికే అదుపు తప్పి కూలిపోవడంతో భారీ ప్రాణనష్టం సంభవించింది. ఈ ఘటనపై పాకిస్థాన్ సైన్యం మీడియా విభాగం ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR)ను ఉటంకిస్తూ పాకిస్థాన్ ప్రముఖ పత్రిక 'డాన్' కథనం ప్రచురించింది. హెలికాప్టర్లో ఉన్న వారందరూ ప్రాణాలు కోల్పోయారని, ఈ ప్రమాదంలో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదని తెలిపింది. ఈ ఘటనతో పాకిస్థాన్ సైన్యంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, సాంకేతిక కారణాలపై విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పాకిస్థాన్లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం.. Mi-17 కూలి 21 మంది మృతి
⚠️ An Mi-17 helicopter belonging to Pakistan Army Aviation crashed near Muzaffarabad on Wednesday during take-off after suffering a reported technical fault, according to the Inter-Services Public Relations (ISPR).
— News.Az (@news_az) June 10, 2026
The military said all personnel on board embraced Shahadat and… pic.twitter.com/Q2ddq2g4sW