Loading...
Mojtaba khamenei: దాడులు ఆగకపోతే అమెరికాకు గట్టి గుణపాఠం తప్పదు.. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ హెచ్చరిక
దాడులు ఆగకపోతే అమెరికాకు గట్టి గుణపాఠం తప్పదు.. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ హెచ్చరిక

Mojtaba khamenei: దాడులు ఆగకపోతే అమెరికాకు గట్టి గుణపాఠం తప్పదు.. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ హెచ్చరిక

వ్రాసిన వారు Moogati Shabari
Jul 19, 2026
01:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా తన సైనిక చర్యలను నిలిపివేయకపోతే మరచిపోలేని విధంగా ప్రతిస్పందిస్తామని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తాబా ఖమేనీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుదుర్చుకున్న శాంతి ఒప్పందానికి ఇప్పుడు ఎలాంటి ప్రాముఖ్యత లేదని, ఆ ఒప్పందం పూర్తిగా అర్థరహితమైందని ఆయన స్పష్టం చేశారు. అమెరికా వరుస దాడులకు నిరసనగా ఆ దేశంతో గతంలో కుదిరిన ఒప్పందంలోని తమ బాధ్యతలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఇరాన్‌ ప్రకటించిన కొద్దిసేపటికే ఖమేనీ సందేశం విడుదలైంది. ఆ సందేశాన్ని ఇరాన్‌ ప్రభుత్వ టెలివిజన్‌లో ప్రసారం చేశారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఖమేనీ ప్రజల ముందుకు రావడం ఇదే తొలి అధికారిక స్పందనగా భావిస్తున్నారు.

వివరాలు

అమెరికాపై తీవ్ర విమర్శలు..

అమెరికా మరోసారి తన అసలు వైఖరిని ప్రపంచానికి చూపించిందని ఖమేనీ ఆరోపించారు.

ఆ దేశం నమ్మకద్రోహానికి పాల్పడిందని పేర్కొంటూ, దాడులు కొనసాగితే అమెరికా భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

ఇరాన్‌ సైనిక బలగాల వద్ద అమెరికా ఎన్నటికీ మరచిపోలేని సమాధానాలు ఉన్నాయని, అవసరమైతే వాటిని అమలు చేస్తామని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా, శనివారం కూడా అమెరికా-ఇరాన్‌ మధ్య పరస్పర దాడులు కొనసాగాయి.

ఈసారి యుద్ధ ప్రభావం మరింత విస్తరించి, కీలక నీటి వనరులు కూడా లక్ష్యాలుగా మారాయి.

వివరాలు

హర్మూజ్‌ ప్రాంతంలో దాడుల మోత..

ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్‌ జలసంధి పరిసరాల్లో యుద్ధ ఉద్రిక్తత మరింత పెరిగింది.

వరుసగా ఏడో రోజు అమెరికా దాడులు కొనసాగించింది. ఇరాన్‌లోని నిఘా కేంద్రాలు, సైనిక రవాణా వ్యవస్థలు, భూగర్భ ఆయుధ నిల్వ కేంద్రాలు, సముద్ర భద్రతా సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు నిర్వహించింది.

ఈ దాడుల ఫలితంగా ఇరాన్‌లో రెండు సొరంగాలు, ఒక వంతెన తీవ్రంగా దెబ్బతిన్నాయి.

దీంతో బందర్‌ అబ్బాస్‌ జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ADVERTISEMENT