NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / మయన్మార్‌లో విరుచుకుపడ్డ శతఘ్ని.. 29 మంది శరణార్థుల దుర్మరణం
    తదుపరి వార్తా కథనం
    మయన్మార్‌లో విరుచుకుపడ్డ శతఘ్ని.. 29 మంది శరణార్థుల దుర్మరణం
    మయన్మార్‌లో విరుచుకుపడ్డ శతఘ్ని.. 29 మంది శరణార్థుల దుర్మరణం

    మయన్మార్‌లో విరుచుకుపడ్డ శతఘ్ని.. 29 మంది శరణార్థుల దుర్మరణం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Oct 10, 2023
    03:44 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మయన్మార్‌లో ఘోరం చోటు చేసుకుంది. తలదాచుకున్న ఓ శరణార్థి శిబిరంపై శతఘ్ని దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ దాడి వెనుక సైన్యం పాత్రపై విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

    దీనిపై స్పందించిన సైన్యం, దాడి తాము జరపలేదని తేల్చి చెప్పింది. లైజాలో సోమవారం అర్ధరాత్రి నిరాశ్రయుల క్యాంప్‌పై శతఘ్ని విరుచుకుపడింది. ఘటనలో 29 మంది మరణించగా సుమారు 44 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.

    మృతుల్లో 11 మంది చిన్నారులు ఉన్నారు. ఘటనా స్థలం కచిన్‌ ఇండిపెండెన్స్‌ ఆర్గనైజేషన్‌ అనే ఓ వేర్పాటువాద ఆధీనంలో ఉంది. 2021లో మయన్మార్‌ పౌర ప్రభుత్వాన్ని కూలదోసిన సైన్యం, రాజ్యాధికారం దక్కించుకుంది.

    details

    కచిన్‌ వేర్పాటువాద సంస్థకు 2 కిమీ దూరంలోనే ఘటన

    ఆనాటి నుంచి ప్రత్యర్థులను అణిచివేసేందుకు, ఆర్మీ వైమానిక దాడులు చేస్తూనే ఉంది. తాజా దాడి వెనుక తమ పాత్రేమీ లేదని సైనిక ప్రతినిధి మేజర్‌ జనరల్‌ ఝా మిన్‌ తున్‌ చెప్పుకొచ్చారు.

    వేర్పాటువాదుల మందుగుండు నిల్వలు పేలడంతోనే ఈ దారుణం జరిగి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

    అయితే కచిన్‌ వేర్పాటువాద సంస్థ ప్రధాన కార్యాలయానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే ఘటనా స్థలం ఉండటం కొసమెరుపు.

    కొన్నాళ్లుగా కచిన్‌ వేర్పాటువాదులు, మయన్మార్‌ సైనిక ప్రభుత్వంతో పోరాటాలు సాగిస్తున్నారు.

    ఈ క్రమంలోనే వీరికి ప్రజల్లో మద్దతు పెరుగుతోంది. ఘటనపై దేశంలోని ఐరాస కార్యాలయం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మయన్మార్

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    మయన్మార్

    పజిగి గ్రామంపై మయన్మార్ మిలిటరీ వైమానిక దాడి; 100మంది మృతి ఆర్మీ
    తుపానుకు 'మోచా' పేరు ఎలా పెట్టారు? అది ఎప్పుడు తీరాన్ని తాకుతుంది?  ఐఎండీ
    మోచా తుపాను: మయన్మార్‌లో ఆరుగురు మృతి, 700 మందికి గాయాలు  తుపాను
    మయన్మార్ నుంచి సేకరించిన ఆయుధాలతోనే మణిపూర్‌లో హింస: ఇంటెలిజెన్స్ వర్గాలు  మణిపూర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025