Page Loader
Myanmar quake: మయన్మార్ భూకంప బీభత్సం.. 334 అణుబాంబుల శక్తితో సమానం
మయన్మార్ భూకంప బీభత్సం.. 334 అణుబాంబుల శక్తితో సమానం

Myanmar quake: మయన్మార్ భూకంప బీభత్సం.. 334 అణుబాంబుల శక్తితో సమానం

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 30, 2025
10:41 am

ఈ వార్తాకథనం ఏంటి

మయన్మార్‌తో పాటు థాయ్‌లాండ్‌లో 12 నిమిషాల వ్యవధిలో వరుసగా సంభవించిన రెండు భారీ భూకంపాలు (Earthquake) తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ భూకంపాల తీవ్రత 334 అణుబాంబులతో సమానమైన శక్తిని విడుదల చేసి భయానక విధ్వంసాన్ని సృష్టించాయని స్థానిక భూవిజ్ఞాన శాస్త్రవేత్త జెస్ ఫీనిక్స్ తెలిపారు. భూకంపాల అనంతరం ఆ ప్రాంతాల్లో మరిన్ని ప్రకంపనలు (Aftershocks) వచ్చే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు.

Details

ఆఫ్టర్‌షాక్స్‌ ముప్పు.. మరింత ప్రమాదం

భారత టెక్టానిక్ ఫలకాలు యురేషియన్ ప్లేట్స్‌ను వరుసగా ఢీకొంటుండడం వల్ల ఈ ప్రాంతంలో నెలల తరబడి ఆఫ్టర్‌షాక్స్‌ వచ్చే అవకాశం ఉందని జెస్ ఫీనిక్స్ తెలిపారు. భూకంపాల ప్రభావంతో ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన మయన్మార్.. అంతర్యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో మరింత తీవ్రమైన విపత్తును ఎదుర్కొంటోందని ఆమె పేర్కొన్నారు. కమ్యూనికేషన్ అంతరాయం భూకంపాల వల్ల కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినడంతో మయన్మార్‌లో నిజమైన పరిస్థితి బయట ప్రపంచానికి పూర్తిగా తెలియడం లేదు. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం, భూకంప కేంద్రాలు భూఉపరితలానికి కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే ఉన్నట్లు వెల్లడైంది.

Details

మృతుల సంఖ్య పెరిగే అవకాశం

ఈ భూకంపాల కారణంగా మృతుల సంఖ్య 10,000 దాటే అవకాశం ఉందని అమెరికా ఏజెన్సీ అంచనా వేసింది. ఇప్పటి వరకు 1,600 మందికి పైగా మృతి చెందినట్లు మయన్మార్ సైనిక ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ విపత్తు తీవ్రతతో మయన్మార్, థాయ్‌లాండ్ ప్రజలు భయంతో వణికిపోతున్నారు.