Nepal Airlines: జమ్ముకశ్మీర్ మ్యాప్ వివాదం.. క్షమాపణ చెప్పిన నేపాల్ ఎయిర్లైన్స్
ఈ వార్తాకథనం ఏంటి
నేపాల్ జాతీయ విమాన సంస్థ నేపాల్ ఎయిర్లైన్స్ కార్పొరేషన్ (NAC) పెద్ద వివాదంలో చిక్కుకుంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రమోషనల్ మ్యాప్లో జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను భారత్కు బదులు పాకిస్థాన్లో భాగంగా చూపించడం వైరల్ అయింది. ఈ పొరపాటు బుధవారం బయటపడింది. దీంతో భారతీయ ప్రయాణికులు తీవ్రంగా స్పందించారు. 'కార్టోగ్రాఫిక్ అగ్రెషన్' అంటూ విమర్శలు గుప్పించారు. BoycottNepalAirlines హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతూ పెద్ద దుమారం రేపింది. కొందరు విదేశాంగ మంత్రిత్వ శాఖ, సివిల్ ఏవియేషన్ శాఖలను ట్యాగ్ చేస్తూ అధికారిక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వివరాలు
ప్రమోషనల్ మెటీరియల్పై కఠిన తనిఖీలు
వివాదం ముదిరిపోవడంతో నేపాల్ ఎయిర్లైన్స్ ఉదయం 10 గంటలకల్లా ఆ పోస్టును తొలగించి క్షమాపణలు చెప్పింది. ఈ తప్పిదం థర్డ్ పార్టీ క్రియేటివ్ ఏజెన్సీ వల్ల జరిగిన సాంకేతిక పొరపాటు అని వెల్లడించింది. అన్ని పొరుగు దేశాల భౌగోళిక సమగ్రతను గౌరవిస్తామని స్పష్టం చేసింది. ఇకపై ఇలాంటి తప్పులు జరగకుండా అన్ని ప్రమోషనల్ మెటీరియల్పై కఠిన తనిఖీలు చేపడతామని తెలిపింది. అలాగే ఈ ఘటనపై అంతర్గత సమీక్ష కూడా నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వివాదానికి కారణమైన మ్యాప్ ఇదే..
India has kept Nepal’s economy breathing for decades… open borders, jobs for lakhs of Nepalis, trade access via Indian ports, fuel pipelines, power projects, disaster relief, infrastructure, scholarships, even military cooperation.
— Divya Gandotra Tandon (@divya_gandotra) April 29, 2026
And this is how Nepal Airlines responds?
A… pic.twitter.com/fbc7IxA8ds