LOADING...
Netanyahu : గాజాలో 70 శాతం భూభాగాన్ని స్వాధీనం చేసుకోవాలని సైన్యానికి ఆదేశాలు: నెతన్యాహు
గాజాలో 70 శాతం భూభాగాన్ని స్వాధీనం చేసుకోవాలని సైన్యానికి ఆదేశాలు: నెతన్యాహు

Netanyahu : గాజాలో 70 శాతం భూభాగాన్ని స్వాధీనం చేసుకోవాలని సైన్యానికి ఆదేశాలు: నెతన్యాహు

వ్రాసిన వారు Sirish Praharaju
May 29, 2026
09:43 am

ఈ వార్తాకథనం ఏంటి

గాజా ప్రాంతంలో 70శాతం కంటే ఎక్కువ భూభాగాన్ని తమ నియంత్రణలోకి తీసుకురావాలని ఇజ్రాయెల్ సైన్యానికి ఆదేశాలు జారీ చేసినట్లు ఆ దేశ ప్రధాని నెతన్యాహు వెల్లడించారు. ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. హమాస్‌పై ఇజ్రాయెల్ సైన్యం క్రమంగా పట్టు బిగిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం గాజాలో సుమారు 60శాతం భూభాగం తమ ఆధీనంలో ఉందని,దశలవారీగా ముందుకు సాగుతూ 70శాతం నియంత్రణ లక్ష్యాన్ని చేరుకోవాలని సైన్యానికి సూచించినట్లు చెప్పారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య గత ఏడాది అక్టోబరులో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన సమయంలో గాజా భూభాగంలో దాదాపు 53శాతం ప్రాంతం ఇజ్రాయెల్ సైన్యం నియంత్రణలో ఉన్నట్లు సమాచారం.

వివరాలు 

సైనిక చర్యల కారణంగా..

అనంతరం చేపట్టిన సైనిక చర్యలతో ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ఆ నియంత్రణ 64శాతానికి పెరిగినట్లు ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసిన పటాలు సూచించాయి. ఇక గాజాలో మరిన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు అక్కడి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే యుద్ధ పరిస్థితులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న లక్షలాది మంది పాలస్తీనా ప్రజలు మరింత కష్టాల్లో పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కొత్తగా చేపట్టే సైనిక చర్యల కారణంగా దాదాపు 20లక్షల మంది తమ నివాస ప్రాంతాలను విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తవచ్చని అంచనా వేస్తున్నారు.

Advertisement