NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / వచ్చే ఐదేళ్లు రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదతాయ్: ప్రపంచ వాతావరణ సంస్థ 
    తదుపరి వార్తా కథనం
    వచ్చే ఐదేళ్లు రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదతాయ్: ప్రపంచ వాతావరణ సంస్థ 
    వచ్చే ఐదేళ్లు రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదతాయ్: ప్రపంచ వాతావరణ సంస్థ

    వచ్చే ఐదేళ్లు రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదతాయ్: ప్రపంచ వాతావరణ సంస్థ 

    వ్రాసిన వారు Stalin
    May 17, 2023
    06:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    2023-2027 మధ్య కాలంలో అంటే వచ్చే ఐదేళ్ల కాలంలో రికార్డుస్థాయిలో ప్రపంచ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది.

    గ్రీన్‌హౌస్ వాయువులు, ఎల్ నినో కలిసి ఉష్ణోగ్రతలను పెంచుతాయి బుధవారం హెచ్చరించింది. 2027 నాటికి ప్రపంచం 1.5C వాతావరణ పరిమితిని అధిగమించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

    ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) పరిశోధన ప్రకారం, కీలకమైన 1.5C థ్రెషోల్డ్‌ను ఉల్లంఘించడం భయంకరమైన పరిణామాలను కలిగిస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

    అయితే ఇది తాత్కాలితమే అని చెబుతున్నారు. అయినప్పటికీ, ఇది ప్రపంచ వాతావరణ వ్యవస్థపై మానవ అవసరాన్ని సూచిస్తుందని డబ్ల్యూఎంఓ హెచ్చరించింది.

    ఐక్యరాజ్య సమితి

    ప్రపంచ ఉష్ణోగ్రతలు 1.5C కంటే ఎక్కువ ఉండకూడదని పారిస్ ఒప్పందంలో నిర్ణయం

    2015 పారిస్ వాతావరణ ఒప్పందం ప్రకారం, ప్రపంచ ఉష్ణోగ్రతలు 1.5C కంటే ఎక్కువ ఉండకూడదని కూటమి దేశాలు ప్రతిజ్ఞ చేశాయి.

    1.5C కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు విపత్తతో పాటు కోలుకోలేని ప్రభావాలకు దారి తీస్తాయని డబ్ల్యూఎంఓ చెప్పింది.

    ఈ నివేదిక ఉద్దేశం పారిస్ ఒప్పందంలో పేర్కొన్న 1.5Cని శాశ్వతంగా అధిగమించగలమని కాదని, చాలా సంవత్సరాలు భూమి వెడెక్కడాన్ని సూచిస్తుందని డబ్ల్యూఎంఓ సెక్రటరీ జనరల్ ప్రొఫెసర్ పెట్టేరి తాలస్ తెలిపారు.

    ప్రపంచ సగటు ఉపరితల ఉష్ణోగ్రతలు మునుపెన్నడూ 1.5C థ్రెషోల్డ్‌ను అతిక్రమించలేదని పేర్కొన్నారు.

    2023 -2027 మధ్య కనీసం ఒక సంవత్సరంలో 1.5C థ్రెషోల్డ్‌ను అధిగమించే అవకాశం 66శాతం ఉందని నివేదిక పేర్కొంది.

    ఐరాస

    ఎల్ నినో అభివృద్ధి చెందిన ఏడాదిలోనే ఉష్ణోగ్రతల్లో పెరుగుదల

    అధిక ఉష్ణోగ్రతల ప్రభావం ఆరోగ్యం, ఆహార భద్రత, నీటి నిర్వహణ, పర్యావరణంపై ఉంటుందని, దీనికి అందరం సిద్ధంగా ఉండాలని డబ్ల్యూఎంఓ పేర్కొంది.

    ఎల్ నినో అభివృద్ధి చెందే అవకాశాలు ఈ ఏడాది జూలై చివరి నాటికి 60 శాతం, సెప్టెంబర్ చివరి నాటికి 80 శాతంగా ఉంటాయని డబ్ల్యూఎంఓ ఈ నెల ప్రారంభంలో పేర్కొంది.

    సాధారణంగా, ఎల్ నినో అభివృద్ధి చెందిన తర్వాత సంవత్సరంలో ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. అంటే 2024 నాటికి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది.

    గ్రీన్‌హౌస్ వాయువులుగా పిలవబడే కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వల్ల వాతావరణంలో వేడి చిక్కుకుపోతుంది. దీని వల్ల ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయిలో నమోదవుతాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐక్యరాజ్య సమితి
    ఉష్ణోగ్రతలు
    వాతావరణ మార్పులు
    తాజా వార్తలు

    తాజా

    Donald Trump: వలసదారులపై సుప్రీం తీర్పు అమెరికాకు ముప్పు: ట్రంప్‌ ఫైర్ డొనాల్డ్ ట్రంప్
    Rajinikanth: వివేక్ ఆత్రేయకు రజనీ కాంత్ గ్రీన్ సిగ్నల్  రజనీకాంత్
    Dry fruit lassi: పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే డ్రై ఫ్రూట్ లస్సీ ఇలా తయారు చేసుకోండి! జీవనశైలి
    Tabu: మళ్లీ వార్తల్లో కృష్ణజింక కేసు.. సైఫ్‌, టబు, నీలం, సోనాలీపై విచారణ కొనసాగుతోంది బాలీవుడ్

    ఐక్యరాజ్య సమితి

    భారత్‌లో హిందూ వ్యతిరేక శక్తులు నిత్యానందను వేధించాయి: 'కైలాస' రాయబారి విజయప్రియ కైలాసం
    పుతిన్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు; సమర్థించిన బైడెన్ వ్లాదిమిర్ పుతిన్
    ఐపీసీసీ హెచ్చరిక; 'గ్లోబల్ వార్మింగ్‌ 1.5 డిగ్రీలు దాటుతోంది, ప్రపంచదేశాలు మేలుకోకుంటే ఉపద్రవమే' ప్రపంచం
    ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్; చైనా కంటే 2.9 మిలియన్లు ఎక్కువ భారతదేశం

    ఉష్ణోగ్రతలు

    మార్చిలో భగభగమన్న భూమి; చరిత్రలో రెండోసారి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు భూమి
    హైదరాబాద్‌ వాసులూ జాగ్రత్త; పెరిగిన పగటి పూట ఉష్ణోగ్రతలు హైదరాబాద్
    తెలంగాణలో పెరిగిన ఎండలు; రాబోయే ఐదు రోజులు పెరగనున్న ఉష్ణోగ్రతలు  తెలంగాణ
    ఆంధ్రప్రదేశ్‌లోని 116 మండలాల్లో వేడిగాలులు; అమసరమైతే బయటకు రావాలని ఐఎండీ సూచన ఆంధ్రప్రదేశ్

    వాతావరణ మార్పులు

    తెలంగాణలో 4రోజులు ఎండలే ఎండలు; ఆరెంజ్, యెల్లో హెచ్చరికలు జారీ తెలంగాణ
    దిల్లీని వణికిస్తున్న భారీ వర్షాలు, పలు ప్రాంతాలు జలమయం; ట్రాఫిక్‌కు అంతరాయం దిల్లీ
    భారత్‌లో 1,091 పక్షి జాతుల్లో 73% బర్డ్స్‌పై వాతావరణ మార్పుల ప్రభావం భారతదేశం
    ధూలి కారణంగా మరింత క్షీణిస్తున్న  గాలి నాణ్యత దిల్లీ

    తాజా వార్తలు

    కర్ణాటక సీఎం ఎవరో తేలేది నేడే; ఖర్గే ఆధ్వర్యంలో కీలక సమావేశం కర్ణాటక
    ఖగోళ ఫోటోగ్రాఫర్ అద్భుతం; చంద్రుడిని అన్ని యాంగిల్స్‌లో కెమెరాలో బంధించేశాడు చంద్రుడు
    సీబీఐ కొత్త డైరెక్టర్ ప్రవీణ్ సూద్ చదువు, కెరీర్ వివరాలు మీకోసం  సీబీఐ
    మోచా తుపాను: మయన్మార్‌లో ఆరుగురు మృతి, 700 మందికి గాయాలు  తుపాను
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025