Loading...
Pakistan: ఆపరేషన్ సిందూర్ డాక్యుమెంటరీతో పాక్‌కు కొత్త చిక్కులు
Pakistan: ఆపరేషన్ సిందూర్ డాక్యుమెంటరీతో పాక్‌కు కొత్త చిక్కులు

Pakistan: ఆపరేషన్ సిందూర్ డాక్యుమెంటరీతో పాక్‌కు కొత్త చిక్కులు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 18, 2026
03:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆపరేషన్ సిందూర్‌పై డిస్కవరీ రూపొందించిన కొత్త డాక్యుమెంటరీపై పాకిస్థాన్ సైనిక వ్యవస్థ తీవ్రంగా స్పందించింది. 2025 మేలో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన నాలుగు రోజుల సైనిక ఘర్షణను డాక్యుమెంటరీలో చూపించిన తీరుపై పాక్ అభ్యంతరం వ్యక్తం చేసింది. 'Declassified: Operation Sindoor' పేరుతో రూపొందిన రెండు భాగాల డాక్యుమెంటరీ ఆగస్టు 15న ప్రసారమైంది. ఇందులో ఆపరేషన్ సిందూర్‌ ప్రణాళిక, అమలులో నేరుగా పాల్గొన్న భారత సైనిక, భద్రతా అధికారులు తమ అనుభవాలను వెల్లడించారు.

వివరాలు 

పహల్గాం దాడి తర్వాత భారత్ తీసుకున్న నిర్ణయాలు

2025 ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి భారత్ ఎలా స్పందించింది? ఆ తర్వాత ఎలాంటి సైనిక చర్యలు చేపట్టింది? అనే అంశాలను డాక్యుమెంటరీలో వివరించారు.

88 గంటలపాటు సాగిన ఆపరేషన్ సమయంలో భారత్ తీసుకున్న కీలక నిర్ణయాలపై కూడా ఇందులో అరుదైన వివరాలు వెల్లడయ్యాయి.

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ దేశ భద్రత, ఉగ్రవాదంపై ప్రతిఘటన విషయంలో భారత్ అనుసరించిన విధానాన్ని వివరించారు.

వివరాలు 

ఉగ్రవాదంపై భారత్ వెనక్కి తగ్గదు: దోవల్

భారత్ చూపించే ఉదారత, సహనం, సంయమనం బలహీనతగా భావించకూడదని అజిత్ దోవల్ పేర్కొన్నారు.

దేశ ప్రయోజనాలు, ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడితే భారత్ సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటుందని తెలిపారు.

అవసరమైతే గట్టిగా దెబ్బకొట్టే సామర్థ్యం భారత్‌కు ఉందని స్పష్టం చేశారు.

పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టినట్లు డాక్యుమెంటరీ పేర్కొంది.

పాకిస్థాన్, పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్‌లోని లక్ష్యాలపై భారత్ కచ్చితమైన దాడులు చేపట్టిన తీరును కూడా ఇందులో చూపించారు.

చివరకు 88 గంటల తర్వాత ఇరు దేశాల మధ్య సైనిక చర్యలను నిలిపివేసే అవగాహన కుదిరినట్లు డాక్యుమెంటరీ తెలిపింది.

ADVERTISEMENT

వివరాలు 

భారత్ కథనాన్ని పాక్ సైన్యం తిరస్కరణ

అయితే డాక్యుమెంటరీలోని వివరాలను పాకిస్థాన్ సైన్యం పూర్తిగా తోసిపుచ్చింది.

పాక్ సైనిక మీడియా విభాగం ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్‌పీఆర్‌) ఈ కథనం 'అత్యంత నాటకీయంగా, పక్షపాతంగా, వాస్తవాలకు విరుద్ధంగా' ఉందని విమర్శించింది.

గతేడాది జరిగిన ఘర్షణ ఫలితాలను భారత్ తనకు అనుకూలంగా మార్చి చూపించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించింది.

'బాలీవుడ్ తరహా ప్రచార వీడియో' అంటూ విమర్శ

డాక్యుమెంటరీని 'బాలీవుడ్ తరహా' నిర్మాణంగా పాక్ సైన్యం అభివర్ణించింది.

భారత సైనిక వైఫల్యాన్ని విజయంగా చూపించేందుకు ప్రచార వీడియోను రూపొందించారని ఆరోపించింది.

ఆపరేషన్‌లో భారత్ '100 శాతం విజయం' సాధించిందన్న వాదనను కూడా పాక్ తిరస్కరించింది.

భారత దాడులను తమ సైనిక బలగాలు ఎదుర్కొన్నాయని, భారత విమానాలకు నష్టం కలిగించాయని పాక్ పేర్కొంది.

ADVERTISEMENT

వివరాలు 

కాల్పుల విరమణపై పాక్ భిన్న వాదన

సైనిక చర్యలు ముగియడం కూడా భారత్ సాధించిన నిర్ణయాత్మక విజయంగా చూడకూడదని పాక్ సైన్యం పేర్కొంది.

ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) మధ్య జరిగిన సంప్రదింపుల ద్వారానే సైనిక చర్యలు నిలిచిపోయాయని తెలిపింది.

ఈ విషయంలో భారత్ చెబుతున్న కాలక్రమం, పహల్గాం దాడి తర్వాత జరిగిన పరిణామాలపై కూడా పాక్ అనేక ప్రశ్నలు లేవనెత్తింది.

వివరాలు 

భారత్ వెర్షన్‌కు డాక్యుమెంటరీలో చోటు

డిస్కవరీ రూపొందించిన ఈ డాక్యుమెంటరీకి ప్రధాన ప్రాధాన్యం.. ఆపరేషన్ సిందూర్‌లో నేరుగా పాల్గొన్న భారత ఉన్నతాధికారుల వాంగ్మూలాలను ఇందులో పొందుపరచడమే. ఘర్షణ సమయంలో ప్రభుత్వ వర్గాలు విడుదల చేసిన ప్రకటనలకే పరిమితం కాకుండా, ఆపరేషన్ వెనుక జరిగిన ప్రణాళిక, తీసుకున్న నిర్ణయాలు, నిర్దేశించిన సైనిక లక్ష్యాలను అధికారులు వివరించారు.

సీనియర్ సైనిక కమాండర్లు, జాతీయ భద్రతా అధికారులు, ఆపరేషన్‌లో భాగమైన ఇతర కీలక వ్యక్తుల వివరాలతో ఆపరేషన్ సిందూర్‌ను మరోసారి విశ్లేషించారు.

దీంతో పహల్గాం దాడి తర్వాత భారత్ ఎలా స్పందించింది? సైనిక చర్యలను ఎలా రూపొందించింది? లక్ష్యాలను ఎలా నిర్దేశించింది? అనే అంశాలపై భారత వాదనను మరింత విస్తృతంగా ప్రజల ముందుకు తీసుకువచ్చినట్లైంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

DG ISPR చేసిన ట్వీట్ 

ADVERTISEMENT