NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Pak-America: మోదీకి.. పాక్ -అమెరికన్ బిజినెస్ మెన్ అరుదైన ప్రశంస
    తదుపరి వార్తా కథనం
    Pak-America: మోదీకి.. పాక్ -అమెరికన్ బిజినెస్ మెన్ అరుదైన ప్రశంస
    మోదీకి.. పాక్ -అమెరికన్ బిజినెస్ మెన్ అరుదైన ప్రశంస

    Pak-America: మోదీకి.. పాక్ -అమెరికన్ బిజినెస్ మెన్ అరుదైన ప్రశంస

    వ్రాసిన వారు Stalin
    May 15, 2024
    01:39 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన ప్రశంస లభించింది. బాల్టీ మోర్ నివాసి పాక్ -అమెరికన్ బిజినెస్ మెన్ అజామ్ తరార్ .. మోడీ కేవలం భారత్ కే కాకుండా దక్షిణాసియాకు మంచి చేకూరుస్తారని ఆయన ఆకాంక్షించారు.

    ఆయన మూడో సారి ప్రధాని పీఠం దక్కడం ఖాయన్నారు. భవిష్యత్తులో తమ దేశానికి కూడా ఇలాంటి నాయకుడు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

    మోడీని ప్రశంసాపూర్వకమైన నాయకుడిగా చెపుతునే,పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కలిగిన నేతన్నారు. ప్రతి కూల పరిస్ధితుల నడుమ సైతం రాజకీయంగా ఇబ్బందులు ఉన్నా ఆయన తమ దేశంలో పర్యటించారన్నారు.

    పాక్ తో మోడీ చర్చలు జరిపి , వాణిజ్య సంబంధాలను ఆశిస్తున్నట్లు అజామ్ తరార్ పి.టి.ఐ కిచ్చిన ఇంటర్వూలో ఆశాభావం వ్యక్తం చేశారు.

    Details 

    పాకిస్ధాన్ పాలకులతో సన్నిహిత సంబంధాలు

    ఇస్లామాబాద్ తో మంచి శాంతియుత సంబంధాలు ఉండటం భారత్ కు మంచిదని చెప్పారు.

    నరేంద్ర మోడీ మాత్రమే కాబోయే ప్రధాని అని కుండబద్దలు కొట్టారు. ఈ పాక్ వ్యాపారవేత్త 90 వ దశకంలో అమెరికా వచ్చి స్ధిరపడ్డారు.

    ఆయనకు అప్పటి పాకిస్థాన్ పాలకులతో సన్నిహిత సంబంధాలు ఉండేవి.

    97 కోట్ల మంది భారతీయులు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం అతి పెద్ద ప్రజాస్వామ్యంలో విశేషంగా అభిప్రాయపడ్డారు.

    2024 నుంచి నరేంద్ర మోడీకి విశేషంగా ఆదరణ పెరిగిందని అజామ్ తరార్ తెలిపారు.

    Details 

    విద్యుత్ ఛార్జీలు భారం 

    తమ దేశ ప్రజలు సైతం భారతీయుల నుంచి నేర్చుకోవాల్సి ఉందన్నారు. తమ దేశంలో నెలకొన్న ఆర్ధిక సంక్షోభం వల్ల సహా అక్కడి పాక్ ఆక్రమిత కాశ్మీర్(పివోకె) లో అశాంతి నెలకొందని అభిప్రాయపడ్డారు.

    ఆర్ధిక సంక్షోభంతో ద్రవ్యోల్బణం పెరిగింది. దాంతో పెట్రోల్ ధరలు అధికమయ్యాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐ.ఎం.ఎఫ్) పన్నులను పెంచమంటోంది.

    విద్యుత్ ఛార్జీలు భారమయ్యాయి. ఎగుమతులు చేయలేకపోతున్నాం. విద్యుత్ ఛార్జీలు భారం కావడం వల్లే పివోకెలో అల్లర్లు , ఘర్షణలు జరుగుతున్నాయన్నారు.

    పాక్ ప్రధాని.. పివోకెలో నివసించే ప్రజలకు ఆర్ధిక సాయం ప్రకటించడాన్నిఅజామ్ తార్ తప్పు పట్టారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    నరేంద్ర మోదీ

    Narendra Modi: లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రధాని మోడీకి రష్యా, ఉక్రెయిన్ దేశాధ్యక్షులు ఆహ్వానం  జెలెన్‌స్కీ
    PM Modi-Bill Gates: AI పై చర్చించిన నరేంద్ర మోదీ ,బిల్ గేట్స్ బిల్ గేట్స్
    Bharat Ratna: భారతరత్న అవార్డులు ప్రధానం చేసిన రాష్ట్రపతి  భారతరత్న
    PM Modi: కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు ఇచ్చి కాంగ్రెస్ దేశ సమగ్రతను బలహీనపరిచింది: ప్రధాని మోదీ  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025