LOADING...
Pakistan: అమెరికాకు షాక్.. పాక్ డబుల్ గేమ్?.. ఇరాన్‌కు 6 భూమార్గాలు ఓపెన్
అమెరికాకు షాక్.. పాక్ డబుల్ గేమ్?.. ఇరాన్‌కు 6 భూమార్గాలు ఓపెన్

Pakistan: అమెరికాకు షాక్.. పాక్ డబుల్ గేమ్?.. ఇరాన్‌కు 6 భూమార్గాలు ఓపెన్

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 30, 2026
01:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌పై అమెరికా ఒత్తిడి పెంచుతున్న సమయంలో, పాకిస్థాన్ తీసుకున్న తాజా నిర్ణయం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. పాకిస్తాన్, ఇరాన్‌కు వాణిజ్యానికి ఆరు భూమార్గాలను అధికారికంగా తెరిచింది. హార్ముజ్ జలసంధిలో సముద్ర మార్గాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే, అమెరికా నిపుణులు దీన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. భద్రతా నిపుణుడు డెరెక్ జె. గ్రాస్‌మన్ ప్రకారం, ఇది డొనాల్డ్ ట్రంప్ అమలు చేస్తున్న ఆర్థిక ఒత్తిడి వ్యూహాన్ని బలహీనపరుస్తుందని తెలిపారు. ఈ మార్గాల ద్వారా ఇరాన్ అమెరికా నిర్బంధాన్ని తప్పించుకుని తన ఆయిల్ వ్యాపారాన్ని కొనసాగించే అవకాశముందని ఆయన హెచ్చరించారు.

వివరాలు 

మధ్యవర్తిత్వం విషయంలో పాకిస్తాన్ విశ్వసనీయతపై సందేహాలు

ఇక మధ్యవర్తిత్వం విషయంలో పాకిస్తాన్ విశ్వసనీయతపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్(Reuven Azar),పాకిస్తాన్‌ను నమ్మదగిన దేశంగా చూడలేమని వ్యాఖ్యానించారు. మరోవైపు, పాక్ తటస్థంగా వ్యవహరించడం లేదని ఇరాన్ నేతలు విమర్శిస్తున్నారు. ఇబ్రహీం రెజాయీ(Ebrahim Rezaei), పాకిస్తాన్ అమెరికా వైపు మొగ్గు చూపుతోందని పేర్కొన్నారు. అమెరికా వ్యూహం ప్రకారం, సముద్ర మార్గాల్ని మూసేసి ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడి పెంచాలని చూస్తోంది. కానీ పాకిస్తాన్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆ వ్యూహానికి గట్టి దెబ్బ తగిలినట్టే కనిపిస్తోంది. ఇప్పటికే వేలాది సరుకు కంటైనర్లు పాకిస్తాన్ పోర్టుల్లో నిలిచిపోయి ఉండగా, ఇవి ఇప్పుడు భూమార్గాల ద్వారా ఇరాన్‌కు చేరే అవకాశముంది. దీంతో ఈ అంశం అంతర్జాతీయ రాజకీయాల్లో మరింత వేడి పెంచుతోంది.

Advertisement