Pakistan airspace: పాక్ గగనతల నిషేధం మే 24 వరకు పొడిగింపు
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ తన గగనతలంలో భారత విమానాల ప్రయాణంపై ఏడాది క్రితం విధించిన నిషేధాన్ని మరో నెలపాటు పొడిగించింది. ఈ నిషేధం మే 24 వరకు అమలులో ఉంటుందని పాకిస్థాన్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ వెల్లడించింది. ముందుగా అమల్లో ఉన్న నిషేధ గడువు ముగియడానికి కొద్ది రోజుల ముందే పాక్ ఈ తాజా నిర్ణయం తీసుకుంది. ఇక భారత్ కూడా తన గగనతలాన్ని పాక్ విమానాలు వినియోగించకుండా విధించిన నిషేధాన్ని పొడిగించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
వివరాలు
పశ్చిమాసియాకు వెళ్లే అనేక విమానాలు.. పాకిస్థాన్ గగనతలం మీదుగా
పహల్గాం ఉగ్రదాడి తరువాత పెరిగిన ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇరు దేశాలు పరస్పరం గగనతల నిషేధాలు అమలు చేస్తున్నాయి. తన గగనతల వినియోగంపై విధించిన ఈ నిషేధం భారత వాణిజ్య విమాన సంస్థలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని పాక్ పేర్కొంటోంది. నిషేధానికి ముందు భారత్లోని పలు నగరాల నుంచి పశ్చిమాసియాకు వెళ్లే అనేక విమానాలు పాకిస్థాన్ గగనతలం మీదుగా ప్రయాణించేవి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పాక్ గగనతల నిషేధం మరో నెల పొడిగింపు
Pakistan Extends Airspace Closure For Indian Planes Till May 24https://t.co/S7bvZKtxp9
— Daily Excelsior (@DailyExcelsior1) April 21, 2026