NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Pakistan: పాక్‌లో పెట్రోల్‌ కొరత.. 48 గంటలు బంక్‌ల మూసివేత
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Pakistan: పాక్‌లో పెట్రోల్‌ కొరత.. 48 గంటలు బంక్‌ల మూసివేత
    పాక్‌లో పెట్రోల్‌ కొరత.. 48 గంటలు బంక్‌ల మూసివేత

    Pakistan: పాక్‌లో పెట్రోల్‌ కొరత.. 48 గంటలు బంక్‌ల మూసివేత

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 10, 2025
    09:39 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్‌తో పెరిగిన ఉద్రిక్తతలతోపాటు ఆర్థిక సంక్షోభంతో ఇప్పటికే కుదేలైన పాకిస్థాన్‌కు ఇప్పుడు మరో ముప్పు ఎదురైంది.

    దేశవ్యాప్తంగా ఇంధన కొరత ముప్పు ముంచెత్తుతుండగా, రాజధాని ఇస్లామాబాద్‌లో పెట్రోలు, డీజిల్‌ లభ్యతపై ప్రభావం పడింది.

    తాజా నివేదికల ప్రకారం, ఇస్లామాబాద్‌లో ఉన్న అన్ని ఫ్యూయల్‌ స్టేషన్లను రెండు రోజుల పాటు పూర్తిగా మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు.

    శనివారం నుంచి తదుపరి 48 గంటలపాటు బంక్‌లు పనిచేయవు. ఈ మేరకు పరిపాలనా యంత్రాంగం తక్షణ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.

    ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలు అధికారికంగా వెల్లడించనప్పటికీ, ఇంధన నిల్వలు తగ్గిపోవడమే ప్రధాన కారణంగా చెబుతున్నారు.

    Details

    చమురు, డీజిల్‌ వంటి నిత్యావసరాలపై ఒత్తిడి

    ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో స్టాక్‌లను భద్రంగా ఉంచేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.మరోవైపు భారత్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్‌ సైన్యం భారీగా ఆయుధాలను వినియోగిస్తోంది.

    దీనివల్ల చమురు, డీజిల్‌ వంటి నిత్యావసరాలపై ఒత్తిడి పెరుగుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

    ఇకపోతే ఆర్థికంగా తీవ్రంగా కుంగిపోయిన పాక్‌ ఐఎంఎఫ్‌ సహాయాన్ని మరోసారి ఆశ్రయించింది.

    ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF), పాకిస్థాన్‌కు ఒక బిలియన్‌ డాలర్ల అత్యవసర ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసినట్లు ప్రధాని కార్యాలయం ప్రకటించింది.

    Details

    తీవ్రంగా మండిపడ్డ జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి

    ఈ నిర్ణయంపై జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా తీవ్రంగా మండిపడ్డారు.

    'పూంఛ్‌, రాజౌరి, ఉరి వంటి ప్రాంతాల్లో పాక్‌ తరచూ హింసాత్మక చర్యలకు పాల్పడుతుంటే, అలాంటి దేశానికి ఐఎంఎఫ్‌ ఎలా సాయం చేస్తోంది? ఆ దేశానికి బిలియన్‌ డాలర్ల మద్దతు ఇచ్చి, శాంతిని ప్రోత్సహిస్తున్నట్టు ఎలా చెబుతారని విమర్శించారు.

    ఈ నేపథ్యంలో భారత్‌తో యుద్ధ మోహంలో ఉన్న పాక్‌కు దేశంలోని ఇంధన కొరత, ఆర్థిక అసమతుల్యతలు పెద్దసవాలుగా మారనున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్
    ప్రపంచం

    తాజా

    Pakistan: పాక్‌లో పెట్రోల్‌ కొరత.. 48 గంటలు బంక్‌ల మూసివేత పాకిస్థాన్
    Balochistan: పాకిస్థాన్‌కు నెత్తిన మరో బాంబు.. స్వతంత్య్ర దేశంగా ప్రకటించుకున్న బలూచిస్థాన్! పాకిస్థాన్
    India Pakistan War: భారత్ చేతిలో పవర్‌ఫుల్ వెపన్స్.. ఇక పాకిస్తాన్ సర్వనాశనమే భారతదేశం
    Turkey: తుర్కియే అసలు రంగు బయటపడింది.. స్నేహాన్ని మరిచి ద్రోహానికి దిగింది!  ప్రపంచం

    పాకిస్థాన్

    Pakistan: ఖరీఫ్‌ సీజన్‌ నుంచే పాకిస్తాన్ 21% నీటి కొరతను ఎదుర్కొనే అవకాశం అంతర్జాతీయం
    Baglihar Dam: ఈ ప్రాజెక్టు ఎందుకు పాకిస్తాన్‌కు ఆందోళన కలిగిస్తోంది? భారతదేశం
    Operation Sindoor: భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌లో.. 80 మంది ఉగ్రవాదులు మృతి..? ఉగ్రవాదులు
    Operation Sindoor: సోషల్ మీడియాలో పాకిస్థాన్ 'ఫేక్ న్యూస్' వార్.. వాస్తవాలతో స్పందించిన భారతదేశం  సోషల్ మీడియా

    ప్రపంచం

    Putin: భారత్ పర్యటనకు రానున్న పుతిన్ వ్లాదిమిర్ పుతిన్
    King Charles III: బ్రిటన్‌ రాజు కింగ్‌ చార్లెస్‌కు మరోసారి అస్వస్థత బ్రిటన్
    USA:'స్వచ్ఛందంగా దేశాన్ని విడిచిపెట్టండి'... విదేశీ విద్యార్థులకు హెచ్చరిక మెయిల్స్ అమెరికా
    Cyber crime: ఆస్ట్రేలియన్ సూపర్‌పై సైబర్ దాడి.. రూ. 2.6 కోట్లు కాజేశారు! ఆస్ట్రేలియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025