LOADING...
PM Modi: ఒమన్‌ చేరుకున్న ప్రధాని మోదీ.. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు
ఒమన్‌ చేరుకున్న ప్రధాని మోదీ.. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు

PM Modi: ఒమన్‌ చేరుకున్న ప్రధాని మోదీ.. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 18, 2025
08:17 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఇథియోపియా పర్యటనను ముగించుకుని బుధవారం ఒమన్‌కు చేరుకున్నారు. అక్కడ ఉప ప్రధాని (రక్షణ వ్యవహారాలు) సయ్యిబ్‌ షిహాబ్‌ బిన్‌ తారిక్‌ అల్‌ సయిద్‌తో సమావేశమై, ఇరు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక అంశాలతో పాటు ప్రాంతీయ పరిస్థితులపై విస్తృతంగా చర్చించారు. భారత్‌-ఒమన్‌ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న స్నేహ సంబంధాలను మరింత పటిష్టం చేసే అంశాలపై ఇద్దరు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు.

వివరాలు 

 ఒమన్‌ సుల్తాన్‌ హైతమ్‌ బిన్‌ తారిక్‌తో భేటీ 

భారత్‌-ఒమన్‌ మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 70 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రదర్శనను ప్రధాని మోదీ సందర్శించారు. ఒమన్‌ను మోదీ సందర్శించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఒమన్‌ సుల్తాన్‌ హైతమ్‌ బిన్‌ తారిక్‌తో భేటీ కానున్నారు. అలాగే అక్కడ నివసిస్తున్న భారత సంతతి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఒమన్‌ చేరుకున్న ప్రధాని మోదీ

Advertisement