LOADING...
Islamabad: లాహోర్‌లో  నిరసనలు.. 11 మంది మృతి 
లాహోర్‌లో నిరసనలు.. 11 మంది మృతి

Islamabad: లాహోర్‌లో  నిరసనలు.. 11 మంది మృతి 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 11, 2025
12:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

గాజాలో మరణాలు, ట్రంప్‌ శాంతి ప్రణాళికను నిరసిస్తూ పాకిస్థాన్‌లో తెహ్రీక్‌-ఇ-లబైక్‌ (TLP) కార్యకర్తల ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. గురువారం ప్రారంభమైన ఈ నిరసనలు పాకిస్థాన్‌లోని పలు ప్రధాన ప్రాంతాలను కవర్ చేశాయి. ఆందోళనల్లో పంజాబ్‌ పోలీసులు 11 మంది TLP కార్యకర్తలను హత్య చేసినట్లు పార్టీ చీఫ్ సాద్ రిజ్వి ఆరోపించారు. ఘర్షణల సమయంలో 24 మందికి పైగా కార్యకర్తలు గాయపడ్డారు. ఆస్పత్రుల్లోనూ వైద్యులు వారికి సహాయం చేయడంలో నిరాకరణ చూపించారని సాద్ రిజ్వి చెప్పారు. TLP నేతలు పోలీసుల దాడులను ఉద్దేశపూర్వకంగా ఆందోళనలను అణచివేయడానికి చేసిన చర్యగా వ్యాఖ్యానించారు.

Details

 ఇంటర్నెట్ సేవలు నిలిపివేత

ఈ దాడులలో ఆయన నివాసం మీద దాడి జరగడంతో తల్లి, భార్యాపిల్లలను అదుపులోకి తీసుకున్నారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఇస్లామాబాద్‌లోని అమెరికా ఎంబసీ వైపు TLP కార్యకర్తలు ముట్టడి యత్నించడంతో నిరసనలు హింసాత్మకంగా మారాయి. భద్రతా దళాలు కార్యకర్తలను కట్టడి చేయడానికి ప్రయత్నించిన క్రమంలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇస్లామాబాద్, లాహోర్, రావల్పిండిలో నిరసనలు కారణంగా ప్రధాన రవాణా, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయబడినట్లుగా అధికారులు తెలిపారు. ఇస్లామాబాద్, రావల్పిండిలో లాక్‌డౌన్ విధించారు.