NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Papua New Guinea: బంగారు గనిపై హక్కుల వివాదం.. సాయుధ ఘర్షణల్లో 30 మంది మృతి
    తదుపరి వార్తా కథనం
    Papua New Guinea: బంగారు గనిపై హక్కుల వివాదం.. సాయుధ ఘర్షణల్లో 30 మంది మృతి
    బంగారు గనిపై హక్కుల వివాదం.. సాయుధ ఘర్షణల్లో 30 మంది మృతి

    Papua New Guinea: బంగారు గనిపై హక్కుల వివాదం.. సాయుధ ఘర్షణల్లో 30 మంది మృతి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 16, 2024
    03:42 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పపువా న్యూ గినియాలో బంగారు గనిపై చోటు చేసుకున్న హక్కుల వివాదం తీవ్ర ఘర్షణలకు దారితీసింది. ఈ ఘటనలో 30 మంది ప్రాణాలు విడిచారు.

    ఈ విషయాన్ని స్థానిక పోలీసులు సోమవారం ధ్రువీకరించారు. మృతుల సంఖ్య 50కి చేరే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది.

    ఈ ఘర్షణలు పపువా న్యూగినియా మధ్య ప్రాంతంలోని పోర్‌గెరా బంగారుగని వద్ద చోటు చేసుకున్నాయి.

    అగస్టు నెల నుంచి సకార్‌ తెగవారు ఈ బంగారుగని భూమిని అక్రమంగా ఆక్రమించుకోవడంతో, వాస్తవ హక్కులు కలిగిన పయాండె తెగవారు ఘర్షణలో పడ్డారు.

    Details

    భద్రతా దళాలకు అదనపు అధికారులు

    ఆదివారం జరిగిన ఈ ఘర్షణలో సుమారు 300 రౌండ్ల కాల్పులు జరిగాయి. ఇరు వర్గాల మధ్య శాంతి చర్చలు విఫలమవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

    భారీ హింసాత్మక ఘటనల నేపథ్యంలో పపువా న్యూగినియా ప్రభుత్వం భద్రతా దళాలకు అదనపు అధికారాలు కట్టబెట్టింది. అల్లర్లను అరికట్టేందుకు ఆల్కహాల్ విక్రయాలను నిలిపివేసి, రాత్రిపూట కర్ఫ్యూ విధించింది.

    ఈ ప్రాంతంలో గతంలోనూ అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఈ సారి ఆటోమేటిక్ ఆయుధాలు వాడటం వల్ల పరిస్థితి మరింత దిగజారింది.

    ఈ ఏడాది మొదట్లో జరిగిన హింసలో 26 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రపంచం
    ఇండియా

    తాజా

    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్

    ప్రపంచం

    Robert Fico: స్లొవేకియా ప్రధానమంత్రిపై కాల్పులు.. 71 ఏళ్ల షూటర్ ఎవరు?  అంతర్జాతీయం
    kate middleton: క్యాన్సర్ చికిత్సలో గణనీయమైన పురోగతి సాధించిన బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్  అంతర్జాతీయం
    EU Elections: యూరోపియన్ పార్లమెంట్ సీటు గెలుచుకున్న సైప్రస్ యూట్యూబర్  అంతర్జాతీయం
    Malawis vice president : విమాన ప్రమాదంలో మరణించిన మలావి వైస్ ప్రెసిడెంట్ అంతర్జాతీయం

    ఇండియా

    Rains: దేశవ్యాప్తంగా సాధారణం కంటే 7శాతం అధిక వర్షపాతం నమోదు భారత వాతావరణ శాఖ
    Netflix: IC 814 సిరీస్‌ వివాదంపై దిగివచ్చిన నెట్‌ఫ్లిక్స్.. మనోభావాలకు దెబ్బతీయమని హామీ  నెట్ ఫ్లిక్స్
    Madhavi Puri: సెబీ చీఫ్ మాధవీ పురి బుచ్ వ్యవహారంలో ప్రశ్నలు లేవనెత్తిన కాంగ్రెస్  కాంగ్రెస్
    Atlas Cycle : తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న 'అట్లాస్ సైకిల్' మాజీ చీఫ్ సలీల్ కపూర్ ఆత్మహత్య
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025