Page Loader
Temples Vandalized: బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలపై రాళ్ల దాడి.. నిరసన వ్యక్తం చేసిన హిందువులు
బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలపై రాళ్ల దాడి.. నిరసన వ్యక్తం చేసిన హిందువులు

Temples Vandalized: బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలపై రాళ్ల దాడి.. నిరసన వ్యక్తం చేసిన హిందువులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 30, 2024
01:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్‌లో చిన్మోయ్ కృష్ణ దాస్ అరెస్టుకు వ్యతిరేకంగా హిందూ సమాజం నిరసనలు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం బంగ్లాదేశ్‌లోని చటోగ్రామ్ నగరంలో మూడు హిందూ దేవాలయాలను దుండగులు ధ్వంసం చేశారు. స్థానిక మీడియా వివరాలు ప్రకారం, మధ్యాహ్నం 2:30 గంటలకు హరీష్ చంద్ర మున్సెఫ్ లేన్‌లో ఈ ఘటన జరిగింది. శాంతనేశ్వరి మాత్రి ఆలయం, శని మందిరం, శాంతనేశ్వరి కలిబారి ఆలయాల్లో ఈ దాడులు జరిగాయి. వందలాది మంది ఉర్రూతలూగిస్తూ నినాదాలు చేస్తూ ఆలయాలపై రాళ్లు, ఇటుకలు విసిరారు. ఈ దాడిలో ఆలయ ద్వారాలు ధ్వంసమయ్యాయి. కొట్లవలి పోలీస్ స్టేషన్ చీఫ్ అబ్దుల్ కరీం ఈ దాడిని ధ్రువీకరించారు. దాడి తర్వాత, శాంతినేశ్వరి ఆలయ నిర్వహణ కమిటీ సభ్యుడు తపన్ దాస్ స్పందించారు.

Details

చిన్మోయ్ కృష్ణ దాస్‌ పై దేశ ద్రోహం కేసు నమోదు

శుక్రవారం ప్రార్థనలు ముగిసిన తర్వాత వందలాది మంది ఊరేగింపు వచ్చారని, వారు హిందూ, ఇస్కాన్ వ్యతిరేక నినాదాలు చేశారని చెప్పారు. దుండగులు ఒక్కసారిగా దేవాలయాలపై దాడి చేశారని, ఆ సమయంలో తాము ఈ దాడిని ఆపలేకపోయాయని తర్వాత పోలీసులకు సమాచారమిచ్చారన్నారు. అయితే మధ్యాహ్నానికి ముందే అన్ని దేవాలయాలు తలుపులు మూసివేశామని ఆలయ అధికారులు తెలిపారు. ఈ దాడి విషయంపై ఇస్కాన్ ఆధ్యాత్మిక నాయకుడు చిన్మోయ్ కృష్ణ దాస్‌ను నవంబర్ 25న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనపై దేశద్రోహం కేసులు ఉన్నట్లు తెలిపిన పోలీసులు, అతనికి బెయిల్ ప్రతిపాదనపై చిట్టగాంగ్ కోర్టు తిరస్కరించింది.