Iran: అమెరికాకు షాక్..పాకిస్థాన్ మధ్యవర్తిత్వం అవసరం లేదన్న ఇరాన్
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ ఆసియాలో ఉన్న ఘర్షణలను ఆపడానికి అమెరికా-ఇరాన్ మధ్య ప్రత్యక్ష చర్చలకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం అందిస్తుందంటూ పాక్ కొన్ని ప్రకటనలు చేసింది. కానీ ఈ ప్రయత్నాలను ఇరాన్ విస్మరించింది. ఈ విషయంలో తమకు ఎలాంటి పాత్ర లేదు అని స్పష్టంగా తెలిపింది. ఈ సంబంధిత ప్రకటనను ముంబయిలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ వేదికగా పంచుకుంది.
వివరాలు
కాన్సులేట్ జనరల్ ప్రకటన
అమెరికాతో ప్రత్యక్ష చర్చలు జరగడం లేదని, ఇప్పటివరకు వచ్చిన ప్రతిపాదనలు మధ్యవర్తుల ద్వారా వెలువడిన అసమంజసమైన డిమాండ్లేనని ఇరాన్ తెలిపింది. దౌత్య విషయంలో అమెరికా తరచూ తన రాయిటిని మార్చుతూ ఉంటుందని పేర్కొంది. కానీ తమ స్థిరమైన వైఖరి స్పష్టంగా ఉందని, పాకిస్థాన్ మధ్యవర్తిత్వ ప్రణాళికలు పూర్తి స్థాయిలో వారి సొంతమని, వాటిలో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. యుద్ధం ముగింపునకు ఇస్తున్న పిలుపును స్వాగతిస్తామని, కానీ యుద్ధాన్ని ప్రారంభించిన వర్గాన్ని మర్చిపోకూడదని పేర్కొంది.
వివరాలు
ఇరాన్ వైఖరిపై ఫైర్
ఇటీవల ఇస్లామాబాద్లో పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ సౌదీ అరేబియా, ఈజిప్ట్, తుర్కీ మంత్రులతో సమావేశమయ్యారు. ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా ఘర్షణల ప్రభావం మిగతా దేశాలపై ఎలా పడుతున్నదని చర్చించారు. పాకిస్థాన్లో జరగబోయే ఇరాన్-అమెరికా ప్రత్యక్ష చర్చలకు ఆ దేశాల మంత్రులు పూర్తి మద్దతు ఇచ్చారని ఇషాక్ వెల్లడించారు. అయితే ఇరాన్ ఇప్పటివరకు ఈ ప్రయత్నాల్లో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేయడం గమనార్హం.