NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / లండన్ ఫ్లాట్ లో హైదరాబాద్ విద్యార్థిని దారుణ హత్య.. శోకసంద్రంలో కుటుంబం
    తదుపరి వార్తా కథనం
    లండన్ ఫ్లాట్ లో హైదరాబాద్ విద్యార్థిని దారుణ హత్య.. శోకసంద్రంలో కుటుంబం

    లండన్ ఫ్లాట్ లో హైదరాబాద్ విద్యార్థిని దారుణ హత్య.. శోకసంద్రంలో కుటుంబం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 14, 2023
    05:36 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హైదరాబాద్ యువతి ఇంగ్లాండ్ రాజధాని లండన్ లో దారుణ హత్యకు గురైంది. ఉన్నత చదువుల కోసం ఎన్నో ఆశలతో విదేశాలకు వెళ్లిన తేజస్విని ఇంగ్లీష్ దేశంలో ప్రాణాలు వదిలింది.

    ఈ మేరకు బ్రెజిల్‌కు చెందిన ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. ఈ ఘటనలోనే మరో యువతి తీవ్ర గాయాలపాలైంది.

    రంగారెడ్డి జిల్లాలోని హయత్ నగర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన తేజస్విని ఎంఎస్ చదివేందుకు కొంతకాలం కిందట లండన్ వెళ్లింది. అక్కడ స్నేహితులతో కలిసి నివసిస్తూ చదువుకుంటోంది.

    అయితే ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం బ్రెజిల్ దేశానికి చెందిన ఓ యువకుడు తేజస్విని సహా మరో యువతి అఖిలపై ఆకస్మికంగా విరుచుకుపడ్డాడు.

    DETAILS

    తండ్రి ఆరోగ్యం బాగోలేదంటే ఇటీవలే హైదరాబాద్ వచ్చిన తేజస్విని 

    బ్రెజిల్ యువకుడి ఆకస్మిక దాడిలో తేజస్విని ఘటనా స్థలంలోనే మరణించింది. తీవ్ర గాయాలపాలైన అఖిల ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

    ఊరు గానీ ఊరు దేశం గానీ దేశం నుంచి కుమార్తె తేజస్విని మరణించిందని స్నేహితుల నుంచి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.

    దీంతో బాధిత కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోవడంతో చుట్టు పక్కల ప్రాంతాల్లో విచారం నెలకొంది.

    బాధిత తండ్రి శ్రీనివాసులరెడ్డి ఎలక్ట్రీషియన్ గా పని చేస్తున్నారు. తల్లి ఇంట్లోనే ఉంటోంది. 6 నెలల క్రితం తండ్రికి అనారోగ్యం కారణంగా తేజస్విని స్వస్థలానికి వచ్చింది. నెల రోజులపాటు తల్లిదండ్రులతోనే ఉండి తిరిగి లండన్ వెళ్లింది.

    DETAILS

    తేజస్విని ఉంటున్న ఫ్లాట్ ఎదురుగానే నిందితుడి నివాసం

    మరో 2 నెలల్లో తన ఎంఎస్ కంప్లీట్ అయ్యి మంచి ఉద్యోగం వస్తుందనే శుభవార్తను తల్లిదండ్రులతో పంచుకుంది. చదువు పూర్తి అవుతుండటంతో, మరోవైపు తనకు పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు.

    రెండు నెలల్లో హైదరాబాద్ వచ్చాక పెళ్లి చేసుకుంటానని చెప్పిన తమ అమ్మాయి తిరిగిరాని లోకాలకు వెళ్లడాన్ని ఆ అమ్మనాన్నలు జీర్ణించుకోలేకపోతున్నారు.

    తేజస్విని నాలుగేళ్లుగా లండన్ లోనే మాస్టర్ ఆఫ్ సైన్స్ చదువుతోంది. అక్కడ తన ఫ్రెండ్స్ తో కలిసి షేరింగ్ అపార్ట్ మెంట్ లో ఉంటోంది.

    తేజస్విని ఉంటున్న ఎదురు ఫ్లాట్ లో బ్రెజిల్ కు చెందిన ఓ యువకుడు ఉంటున్నాడు. వారి మధ్య గొడవేం జరిగిందో తెలియదు, అంతలోనే ఈ కిరాతకుడు తేజస్వినిని పొట్టనబెట్టుకున్నాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్
    మహిళ

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    హైదరాబాద్

    హైదరాబాద్‌లో జీరో షాడో డే; ఈనెల 9న నీడ కనిపంచదు  తెలంగాణ
    దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో నీరా కేఫ్‌ ప్రారంభం; దీని విశేషాలు ఇవిగో తెలంగాణ
    తెలంగాణ పర్యాటక రంగం కొత్త పుంతలు; బడ్జెట్ హోటళ్ల నిర్మాణం తెలంగాణ
    నేడు హైదరాబాద్‌కు ప్రియాంక గాంధీ రాక: అమె 'పొలిటికల్ టూరిస్ట్' అంటూ కేటీఆర్ ఫైర్ ప్రియాంక గాంధీ

    మహిళ

    ప్రెగ్నెన్సీ సమయంలో ఇచ్చే సలహాలు, వాటి వెనక ఉండే నిజాలు ప్రెగ్నెన్సీ
    బడ్జెట్ 2023: మహిళల కోసం కొత్త పొదుపు పథకాన్ని ప్రకటించిన కేంద్రం బడ్జెట్ 2023
    ముస్లిం మహిళలు విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాలి: మద్రాసు హైకోర్టు తమిళనాడు
    ఇంటర్వ్యూ సాకుతో పిలిచి, మత్తుమందు ఇచ్చి, కారులో మహిళా టెక్కిపై అత్యాచారం అత్యాచారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025