Page Loader
China: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు.. మధ్యవర్తిత్వానికి సిద్ధమన్న చైనా
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు.. మధ్యవర్తిత్వానికి సిద్ధమన్న చైనా

China: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు.. మధ్యవర్తిత్వానికి సిద్ధమన్న చైనా

వ్రాసిన వారు Jayachandra Akuri
May 10, 2025
12:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా మరోసారి స్పందించింది. ఇరు దేశాలు సంయమనంతో వ్యవహరించాలని పిలుపునిచ్చింది. తాజా పరిస్థితులపై నిత్యం నిశితంగా అవగాహన కలిగి ఉన్నామని, సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నదే తమ ఆకాంక్ష అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అవసరమైతే సమస్య పరిష్కారానికి తాము నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నామని బీజింగ్ వెల్లడించింది. ఇదిలా ఉండగా, భారత్-పాక్ సైనిక ఘర్షణలపై చైనా ఇప్పటికే స్పందించింది. ఉగ్రవాదాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించమని స్పష్టం చేసింది.

Details

శాంతికి కట్టుబడి ఉన్నాం

విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ మాట్లాడుతూ, భారత్-పాక్ మధ్య పెరిగుతున్న ఉద్రిక్తతలు తమను తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఉగ్రవాదం ఎటువంటి రూపంలో ఉన్నా దాన్ని ఖండిస్తున్నామని, ప్రాంతీయ శాంతి భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. అయితే ఈ ఘర్షణలపై అమెరికా నుంచి కూడా స్పందన వచ్చింది. భారత్-పాక్ ఘర్షణలో జోక్యం చేయడం తమ బాధ్యత కాదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యానించారు. ఈ రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మెరుగుపడి, ఘర్షణలు ఆగిపోవాలని తమ ఆకాంక్ష అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఉగ్రవాదుల దాడులే తొలి ఉదంతం కాగా, దానికి భారత సైన్యం కౌంటర్ చర్యలు చేపట్టిందని పరోక్షంగా అంగీకరించారు.