శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్కు నిప్పంటించిన దుండగులు
కాలిఫోర్నియా శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్కు ఆదివారం తెల్లవారుజామున 1:30గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. ఈ విషయాన్ని మంగళవారం స్థానిక ఛానెల్ దియా టీవీ ధృవీకరించింది. ఐదు నెలల్లో శాన్ ఫ్రాన్సిస్కోలోని కాన్సులేట్పై జరిగిన రెండో దాడి ఇది. ఖలిస్థానీ మద్దతుదారులు ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఖలిస్థానీ అనుకూల శక్తులు మార్చిలో భారత కాన్సులేట్కార్యాలయంపై దాడి చేసిన విషయం తెలిసిందే. భారత కాన్సులేట్కు నిప్పంటించిన వీడియోను దియా టీవీ ఛానెల్ షేర్ చేసింది. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని, అగ్నిమాపక సిబ్బంది మంటలను త్వరగానే అదుపులోకి తెచ్చినట్లు అధికారులు చెప్పారు. ఈ ఘటనను అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తీవ్రంగా ఖండించారు.