NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / ఉన్మాదిగా మారి ఏడుగురు నవజాతి శిశువులను చంపిన నర్సు
    తదుపరి వార్తా కథనం
    ఉన్మాదిగా మారి ఏడుగురు నవజాతి శిశువులను చంపిన నర్సు
    ఉన్మాదిగా మారి ఏడుగురు నవజాతి శిశువులను చంపిన నర్సు

    ఉన్మాదిగా మారి ఏడుగురు నవజాతి శిశువులను చంపిన నర్సు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 19, 2023
    11:02 am

    ఈ వార్తాకథనం ఏంటి

    నవజాత శిశువుల పట్ల ఓ నర్సు ఉన్మాదిగా వ్యవహరించింది. శిశువులను కంటికి రెప్పలా కాపాడాల్సిన ఆమె ఆస్పత్రిలో ఎవరికి అనుమానం రాకుండా ఏడుగురు నవజాత శిశువులను చంపేసింది. ఇంగ్లండ్ లోని చెస్టర్ కౌంటెస్ ఆఫ్ చెస్టర్ ఆస్పత్రిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.

    లూసి లెబ్టీ అనే మహిళా నర్సు 2015-16 మధ్య కాలంలో ఈ హత్యలకు పాల్పడింది. ఇంజెక్షన్ ద్వారా శిశువుల రక్తంలోకి గాలిని పంపడం, నాసోగ్యాస్ట్రిక్ గొట్టాల ద్వారా కడుపులోకి పాలు, నీటిని బలవంతంగా పంపి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.

    అదేవిధంగా మరో ఆరుగురు శిశువులనూ చంపడానికి యత్నించిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఘటనపై మాంచెస్టర్ క్రౌన్ కోర్టు శుక్రవారం ఆమెను దోషిగా తేలుస్తూ తీర్పునిచ్చింది.

    Details

    తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన లూసి లెబ్టీ

    భారతీయ మూలాలున్న వైద్యుడు రవి జయరాం, లూసీపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శిశు మరణాలపై 2017 మే నెలలో పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఈ కేసుకు సంబంధించి ఆమెను పోలీసులు ఏడుసార్లు అరెస్టు చేశారు.

    తాను చెడ్డదాన్ని అని, ఉద్ధేశపూర్వకంగానే చంపానని, ఎందుకంటే పిల్లలను చూసుకునేంత మంచిదాన్ని తాను కాదని రాసి ఉన్న పేపర్లు లూసి ఇంట్లో లభ్యం కావడం గమనార్హం.

    అయితే లూసీ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. నవజాత శిశువుల వార్డులో లోపాలను కప్పిపుచ్చేందుకే అక్కడి సీనియర్ వైద్యులు తనపై నిందలు మోపారని ఆమె తరుపు న్యాయవాది వాదించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇంగ్లండ్
    ప్రపంచం
    లండన్

    తాజా

    Raashii Khanna: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కు ప్రమాదం.. ముక్కు నుంచి రక్తం.. చేతులకు గాయాలు..  టాలీవుడ్
    Venu : 'ఎల్లమ్మ' ప్రారంభానికి సర్వం సిద్ధం.. కన్‌ఫర్మ్‌ చేసిన దర్శకుడు వేణు టాలీవుడ్
    UK Professor: 'భారత వ్యతిరేక కార్యకలాపాల' కారణంగా విదేశీ పౌరసత్వాన్ని కోల్పోయా..  లండన్
    M R Srinivasan: ప్రముఖ అణు శాస్త్రవేత్త ఎం ఆర్ శ్రీనివాసన్ కన్నుమూత  శాస్త్రవేత్త

    ఇంగ్లండ్

    భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది: కేంబ్రిడ్జ్ ఉపన్యాసంలో రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    BAN vs ENG: జాసన్ రాయ్ సూపర్ సెంచరీ క్రికెట్
    BAN vs ENG: రెండో వన్డేలో అద్భుతంగా రాణించిన జోస్ బట్లర్ క్రికెట్
    BAN vs ENG: బంగ్లాపై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న ఇంగ్లండ్ క్రికెట్

    ప్రపంచం

    EV కోసం బీమాను కొనుగోలు చేస్తున్నారా..? అయితే వీటి గురించి తెలుసుకోండి! ఆటో మొబైల్
    మణిపూర్‌లో మళ్లీ పేలిన గన్.. పాఠశాల బయట మహిళ కాల్చివేత మణిపూర్
    దేశ రాజకీయాల్లో సెగలు పుట్టిస్తున్న నేపాల్ ప్రధాని వ్యాఖ్యలు నేపాల్
    అమెరికాలో కుమారుడిని సెక్స్ బానిసగా వాడుకున్న తల్లి..?.. పోలీసులు ఏం చెప్పారంటే! అమెరికా

    లండన్

    టేకాఫ్‌ అవుతున్న విమానంలో అరుపులు, కేకలు.. డోర్ తీయబోయిన యువకుడు అరెస్ట్  అంతర్జాతీయం
    లండన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. దొంగను పోలీసులు వెంటాడుతుండగా తెలుగు విద్యార్థి మృతి  రోడ్డు ప్రమాదం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025